గురు బ్రహ్మ ...గురు విష్ణు అంటూ దేవుడి స్థానాన్ని కల్పించిన గురువే... ఒళ్ళు కోవెక్కి కూతురులాంటి విద్యార్థినిపై రెండేళ్లుగా అత్యచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . పదవ తరగతి విద్యార్థిని పై ఆ పాఠశాలలో హెడ్ మాస్టర్ గా పనిచేస్తోన్న వ్యక్తి , అత్యాచారానికి పాల్పడుతుండగా , అతడి భార్య వేధింపులకు గురిచేయడం తో ఏమి చేయాలో పాలుపోని సదరు విద్యార్థిని చివరకు తల్లితండ్రులకు చెప్పడం తో వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు . నగర శివారు హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ లోని జావెట్ జార్జి రెసిడెన్షియల్ స్కూల్ లో రామంతాపూర్ కు చెందిన ఒక విద్యార్థిని పదవ తరగతి చదువుతోంది.
సదరు విద్యార్థిని రెసిడెన్షియల్ హాస్టల్ లో ఉంటూ , స్కూల్ లో చదువుకుంటోంది . హాస్టల్ లో ఉంటున్న విద్యార్థినిపై హెడ్ మాస్టర్ కన్నుపై పడింది . సదరు విద్యార్థిని పై ఎనిమిదవ తరగతి చదువుతుండగానే ఒకసారి లైంగిక దాడికి పాల్పడ్డ హెడ్ మాస్టర్ , ఆమె ఎవరికీ చెప్పకపోవడం తో రెచ్చిపోయాడు . దీనితో గత రెండేళ్లుగా సదరు విద్యార్థిని అసహాయతను ఆసరాగా చేసుకుని అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నట్లు తెలుస్తోంది . ఇక హెడ్ మాస్టర్, భార్య ... సదరు బాలికతో ఇంటి పని చేయించుకుంటూ , పనులు చేయకపోతే చెయ్యి చేసుకునేదని తెలుస్తోంది . ఇటీవల వీరిద్దరి వేధింపులు తీవ్రం కావడంతో సదరు విద్యార్థి తట్టుకోలేకపోయింది .
రామంతాపూర్ లోని తల్లితండ్రుల వద్దకు చేరుకొని అసలు విషయాన్ని వారికి చెప్పుకుని కన్నీటి పర్యంతమైంది . కూతురుకు వచ్చిన కష్టాన్ని తెలుసుకున్న తల్లితండ్రులు, తమ కూతురుపై హెడ్ మాస్టర్ గత రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు . పోలీసులు బాధిత బాలిక నుంచి పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు .