పాసుపుస్తకం కు సంబంధించి ఎన్నిసార్లు ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరిగిన ప్రయోజనము లేనందువల్ల తిరిగి తిరిగి అలసి అలసి రైతు సమస్యనుపరిష్కరించలేదని మనస్తాపం చెందిన రైతు.గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మార్వో ఆఫీసులో ఒక రైతు హల్చల్ చేశాడు. తన సమస్యను రెవెన్యూ అధికారులు పరిష్కరించ నందుకు ప్రాయశ్చిత్తంగాపెట్రోల్ బాటిల్తో ఆఫీసులోకి రావడంతో.. ఆఫీసులో వున్న అధికారులు, కార్యాలయ సిబ్బంది షాక్ తిన్నారు.
అతడు లోపలికి రాకుండా అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. తన సమస్యను పరిష్కరించకుండా రోజూ ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నారని రైతు ఆరోపిస్తున్నాడు. నేను ఎంత ఆవేదనకు గురి అవుతున్నానో మీకు అర్థం కావడం లేదు అని ప్రశ్నించాడు.
అక్కడి స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం.. మంగళగిరి ప్రాంతానికి చెందిన టువంటి రైతు శివ కోటేశ్వరరావు పట్టాదారు పాసుపుస్తకం కోసం చాలా రోజుల కిందట దరఖాస్తు చేసుకున్నాడు. చాలా రోజులుగా తన సమస్యను పరిష్కరించాలిఅని అక్కడ ఉన్న అధికారులను అడుగుతున్నాడు కానీ పాసు పుస్తకము ఇవ్వడానికి అధికారులు ఎప్పుడూ ఏదో ఒక సాకు చెప్పి పంపుతున్నారు. ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ తిరిగినా సమస్యను పరిష్కరించకపోవడంతో.. మనస్తాపం చెందిన ఆయన పెట్రోల్ బాటిల్తో వచ్చినట్లు చెబుతున్నారు.
తెలంగాణలోని అబ్దుల్లాపూర్మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి హత్య ఘటన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి తరహా ఘటనలే జరుగుతుండడం బాధాకరం అనిపిస్తుంది. కావున వీలైనంత వరకు రెవిన్యూ అధికారులు రైతుల బాధలను అర్థం చేసుకుని వారికి ఏదో ఒక పరిష్కారం చూపిస్తే బాగుంటుంది.రెవిన్యూ అధికారులు పరిష్కారము చూపిస్తే రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు తెలంగాణతో పాటూ ఏపీలోనూ అక్కడక్కడా రైతులు పెట్రోల్ బాటిళ్లతో ఎమ్మార్వో ఆఫీసుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. సిబ్బంది అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదాలే తప్పాయి. తాజాగా మంగళగిరిలో ఘటన జరగడంతో రెవెన్యూ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.