ఇన్ని రోజులు రాజకీయ నాయకులూ ఒకరి ని ఒకరు ఏవో సభల్లోనో లేదంటే ఎదో వాళ్ళు నిర్వహించే కార్యక్రమాల్లోనో ఎదుటి వారిని గురించి విమర్శించే వారు .కానీ ఇప్పుడు మన రాజకీయ నాయకులూ కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు.సోషల్ మీడియా ను వేదిక గ చేసుకుని మరి ఎదుటి వారిని తిడుతున్నారు . ప్రస్తుతం ఏపీ  లోను అదే జరుగుతుంది .

 

టీడీపీ అధినేత చంద్రబాబు, అతని  పార్టీ నేతలపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శల పర్వం  కొనసాగుతోంది. ఇంగ్లీష్ మీడియం విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారంటూ విజయసాయి మండిపడ్డరు . ఆయన బతుకంతా మ్యానిప్యులేషన్లేనంటూ  విమర్శించారు . ఇక ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ కాల్షీట్లు అయిపోతున్నా.. కుటంబం పిడికిలి అంటూ కొత్త రాగం అందుకుంటున్నారంటూ మండిపడ్డారు.

 

ఇసుక తుఫానులో గిర్రున తిరిగి పడ్డాక ఇంగ్లీష్ మీడియంపై చంద్రబాబు గుండెలు బాదుకున్నారన్నారు విజయసాయిరెడ్డి. ప్రజలు ఛీత్కరించే సరికి అసలు ఇంగ్లీష్‌ మీడియం ఆలోచనే తనదని యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు.  అయన బతుకంతా అవకాశవాదం, మ్యానిప్యులేషన్లే..  ఇప్పటికే మీరు పాఠం లోకి జారిపోయారు .ఆలా  పాతాళంలోకి జారిపోయిన మిమ్మల్ని ధర్మాడి సత్యం కూడా బయటకు లాగలేరు అంటూ ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబుపై వల్లభనేని వంశీ చేసిన మాటల్ని  గురించి విజయసాయిరెడ్డి గుర్తు చేసారు.


ఎలక్షన్ల ముందు పసుపు-కుంకుమ పేరుతో 10 వేలు పంపిణీ చేసి ఐదు కోట్ల మందిని అవమానించింది తమరే కదా చంద్రబాబు గారూ అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు వెయ్యి చొప్పున భృతి ఇచ్చినప్పుడు వారిని హేళన చేసినట్టు అనిపించలేదా.. ఇన్‌సైడర్ ట్రేడింగుతో అమరావతి ప్రకటన చేయడం ప్రజలను మోసగించడం కాదా అంటూ ప్రశ్నించారు. సీఎం జగన్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఇలా కౌంటర్ ఇచ్చారు.

 

సీఎం జగన్ గారిపై ప్యాకేజీ స్టార్‌ విషం కక్కుతున్నారని మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ ఎంపీ. కాల్షీట్లు అయిపోవస్తున్నా ప్రజల నుంచి ఎటువంటి   స్పందన రావడం లేదని..కొత్తగా  కుటుంబ పిడికిలి అంటూ కొత్త రాగం అందుకున్నారని విమర్శించారు. చంద్రబాబు ఫ్యామిలీలో ముగ్గురు పదవుల్లో ఉన్నారు.. మీ అన్నకు ఎంపీ టికెట్ ఇవ్వలేదా అంటూ ప్రశ్నించారు. గురివింద గింజలా నీతులు చెప్పొద్దు అంటున్నారు 
విజయసాయి రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: