టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటన చేయనున్నారు  పర్యటనకు నిరసనగా భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. చంద్రబాబు రావటం మాకు ఇష్టం లేదు అంటూ   రాజధాని రైతులు, రైతు కూలీల పేరుతో నిరసన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు . కృష్ణానది కరకట్ట దగ్గర  నుంచి రాయపూడి వరకూ ఫ్లెక్సీ లు వెలిసాయి . దారి వెంబడి ఉన్న   ఈ ఫ్లెక్సీల్లో చంద్రబాబుకు రాజధాని రైతులు ప్రశ్నల వర్షం కురిపించారు. రాజధాని పేరుతో రైతులను మోసం చేసారు.

 

అని అయినా  కూడా ఏ ముఖం పెట్టుకొని  మళ్లీ రాజధాని పర్యటనకు వస్తున్నారు అంటూ  ఫ్లెక్సీల్లో రైతులు ప్రశ్నించారు. ‘చంద్రబాబు రాజధాని పేరుతో రంగురంగుల గ్రాఫిక్స్‌ చూపించి మమ్మల్ని  మోసం చేశారు. రాజధాని పేరుతో మీరు చేసిన మోసానికి రైతులను   క్షమాపణ అడగాలి . రాజధాని రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతే చంద్రబాబు రాజధానిలో అడుగుపెట్టాలి. అంటూ ఫ్లెక్సీ ల పైన  రాసారు .

 

రాజధాని ప్రజలకు మీరు చెప్పిన హామీ లో ఈదిన అమలు చేసారా అంటూ మీరు ఇస్తాను అన్న     ఉచిత విద్య హామీ అమలు చేశారా? ఇస్తానన్న ఉచిత వైద్యం ఎందుకుఇవ్వలేక పోయారు ? గ్రామ కంఠాల సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారు ?  అంటూ ప్రశ్నలతో ఫ్లెక్సీలపై రాసారు యువతకు ఉపాధి కోసం ఇస్తానన్న రూ.25 లక్షల వడ్డీలేని రుణం హామీ మీకు నాలుగేళ్లు గుర్తుకు రాలేదా?

 

రాజధానిలో రైతు కూలీలకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద 365 రోజులు పని కల్పిస్తామని ఎందుకు రైతు కూలీలను మోసం చేశారు? రాజధాని రైతులకు మీరు కేటాయించిన ప్లాట్లు ఎక్కడ ఉన్నాయి? మూడేళ్లలో అంతర‍్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి ఇస్తానన్న ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదు? జీవో నెంబర్‌ 41 జారీ చేసి అసైన్డ్‌ భూములను సాగు చేస్తున్న దళితులకు ఎందుకు అన్యాయం చేశారు? దళిత ద్రోహి చంద్రబాబు. మీ ఆస్తులు కాపాడుకోవడం, మీ రాజకీయాల కోసం రాజధానిని రాజకీయం చేయొద్దు. మరోసారి మా జీవితాలతో ఆడుకోవద్దు చంద్రబాబు’... అంటూ ప్రశ్నలతో నిరసన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: