తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణాలు పరిశీలించేందుకు చంద్రబాబు నాయుడు బయల్దేరాడు. అయితే ఆలా బయల్దేరిన చంద్రబాబుకు ఘోర అవమానం జరిగింది. ఆ అవమానం చెప్పుకోలేనిది. ఆ అవమానం గురించి మాట్లాడలేనిది. ఆ అవమానం చంద్రబాబుకు చివరి వరుకు గుర్తు ఉంటుంది. 

 

40 ఏళ్ళ చరిత్ర అని చెప్పుకునే చంద్రబాబుకు 70 ఏళ్ళ వయసులో ఘోరాతి ఘోరమైన అవమానం జరిగింది. చంద్రబాబు అమరావతిలోకి వచ్చే ప్రసక్తి లేదని ఇప్పటికే కొందరు రైతులు హెచ్చరించారు. అయినప్పటికీ వినకుండా చంద్రబాబు అమరావతిలోకి అడుగులు వేశాడు. దీంతో అక్కడే ఉన్న కొందరు రైతులు చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులతో దాడి చేశారు. 

 

మరో వైపు వైసీపీ నాయకులూ చంద్రబాబుపై కామెడీ చేస్తున్నారు. చంద్రబాబు పర్యటన అంత ఒక కామెడీ అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉద్రిక్తత సృష్టించేకే ఇలాంటి చిల్లర వేషాలు అని అంటున్నారు. ఇంకా విషయానికి వస్తే చంద్రబాబుపై ఎప్పుడు సెటైర్లు వేసే విజయసాయి రెడ్డి ఈరోజు కూడా అమరావతి పర్యటనపై సంచలన సెటైర్ వేశారు. 

 

ట్విట్టర్ వేధికగా చంద్రబాబుని సినీ నటుడు అన్నారు... ట్విట్టర్ లో విజయసాయి రెడ్డి ఇలా ట్విట్ చేశారు ''సినీ నటుడు వస్తున్నాడంటే నలుగురు పోగవుతారు. తమాషా చూద్దామని జనం  వస్తే అర్థం పర్థం లేని డైలాగులు దంచుతాడు. పార్టీ నిర్మాణం లేదు, రెండు చోట్లా చిత్తుచిత్తుగా ఓడిపోయాడు. ఒక ఎమ్మెల్యే ఉన్నా లేనట్టే. ప్యాకేజి కోసం వీధి ప్రదర్శనలిస్తున్నాడు. సానుభూతి చూపడం మినహా ఏం చేస్తాం.'' అంటూ ట్విట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: