పాపం విషయం తెలియక ఇద్దరు ముసలివారు కన్నీరుమున్నీరయ్యారు .వారి ఏడుపు చూస్తుంటే చాలా బాధను కలిగిస్తుంది .  ఇక అస్సలు విషయానికి వస్తే  ఇద్దరు అక్కాచెల్లెళ్లు  ఏనాటికైనా చావు తప్పదు, అయితే తమ అంత్యక్రియలకు ఆయ్యే ఖర్చు తమ సంతానానికి భారం కాకూడదని ఆలోచించారు . ఇప్పటికె వీరిద్దరికి 70 ఏళ్ళు గడిచినవి ఈ వయసులో  ఎదురవుతున్న అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇద్దరూ కలిసి గోప్యంగా దాచి ఉంచిన రూ.46వేలు  దాచుకున్నారు .తీర వాటిని  బయటకు తీయగా అవన్నీ రద్దయిన పెద్దనోట్లు కావడంతో బిత్తరపోయి కృంగిపోయారు. ఇద్దరు తమ బిడ్డలకు  ఈ విషయాన్నీ చెప్పుకుని బోరుమని విలపించారు.

 


ఈ  సంఘటన తిరుప్పూరు జిల్లా పల్లడం సమీపంలోని పూమలూరులో కే రంగమ్మాళ్‌ (75), పీ తంగమ్మాళ్‌ (72) అనే అక్కచెల్లెళ్లు నివసిస్తున్నారు. రంగమ్మాళ్‌కు ఏడుగురు, తంగమ్మాళ్‌కు ఆరుగురు సంతానం. అందరికీ పెళ్లిళ్లయి వేర్వేరు ఊళ్లలో కాపురం ఉంటున్నారు. వారిద్దరి భర్తలు చనిపోవడంతో పశువులు మేపడం వృత్తిగా పెట్టుకుని వేర్వేరుగా కాపురం ఉంటూ ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. దీని ద్వారా వచ్చే సంపాదనలో ఇద్దరూ  పిల్లలకు తెలియకుండా  కొంతదాచి డబ్బును దాచుకుంటు వచ్చారు .

 

నెలరోజుల క్రితం ఆస్మావ్యాధితో తంగమ్మాళ్‌  బాధపడుతూ చికిత్స కోసం పెరుందురై ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది.తంగమ్మాళ్‌  ఒక కుమారుడిని పిలిచి ఇంటిలో తన అంత్యక్రియల ఖర్చుకోసం కొంతసొమ్ము పొదుపుచేసి ఉన్నాను, అందులో నుంచి కొంత తీసుకురమ్మని పంపింది. ఇంటికి వెళ్లి నగదును చూడగా అవన్నీ రూ.24వేల రూపాయలు ముఖ్యంగా  ఆ డబ్బు  రద్దుకు గురైన రూ.1000, రూ.500 పెద్దనోట్ల కావడంతో అతడు బిత్తరపోయాడు. ఈవిషయాన్ని తల్లికి చెప్పగా తనతోపాటూ సోదరి రంగమ్మాళ్‌ కూడా ఇలానే రూ.22వేలను దాచిపెట్టి  ఉందనే విషయాన్ని తెలిపి కన్నీరుపెట్టుకుంది.

 

లోకజ్ఞానం లేని నిరక్షరాస్యులైన ఈ అక్కచెల్లెళ్లకు పెద్దనోట్ల రద్దు విషయం వీరికి తెలియకపోవడంతో సదరు సొమ్మును బ్యాంకులో మార్చుకోకుండా అలానే ఉంచుకున్నారు. రంగమ్మాళ్‌ కుమారుడు సెల్వరాజ్‌ మాట్లాడుతూ... ప్రభుత్వం ఇచ్చిన ఉచిత టీవీలు వారిద్దరి ఇళ్లలో ఉన్నా గత కొంతకాలంగా అవిపనిచేయడం లేదని, దీంతో పెద్దనోట్ల రద్దు విషయం వారి దృష్టికి రాలేదని తెలిపాడు.  అంత్యక్రియల కోసం వారిద్దరూ కలిసి రూ.46వేలు దాచుకున్నారు. ఆ సొమ్ము ఇక పనికి రాదు అన్న విషయం తెలియడంతో వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారని  అన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: