జెసి దివాకర్ రెడ్డి  ఇంటిలో ఉన్న పనిమనిషి, వంటమనిషి వాచ్ మెన్ మొదలగు వారందరి బినామీల పేరుతో జేసీ దివాకర్ రెడ్డి సోదరులు భారీగా అక్రమ ఆస్తుల్ని కూడబెట్టారని ఆరోపణలు చేస్తున్నాడు అనంతపురం జిల్లాకు చెందిన మురళీ ప్రసాద్ రెడ్డి. ఈ విషయాన్ని ఏ విధంగానైనా బయటపెట్టేందుకు తాను హైకోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. అప్పటి నుంచి తనను ఏ విధంగానైనా చంపాలనే ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపణలు చేయడం జరిగింది.

 

Image result for jc diwakar reddy

 

మురళి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. కేసులు వెనక్కు తీసుకోవాలని నాకు చాలా బెదిరింపులు వచ్చాయి అని తెలిపారు. నాకు.. జెసి బ్రదర్స్ రూ.10 కోట్లు ఆఫర్ చేశారని కూడా తెలిపారు. త్రిశూల్ ఫ్యాక్టరీ పేరుతో జేసీ బ్రదర్స్ వందలకోట్ల రూపాయలు అవినీతి చేశారని మురళీ ప్రసాద్ రెడ్డి ఆరోపణలు చేసాడు. 1600 ఎకరాల్లో ఫ్యాక్టరీ నిర్మిస్తున్నామని అనుమతి లభించింది. కానీ ఎటువంటి ఫ్యాక్టరీని స్థాపించడం జరగలేదు.


గతంలో  2011లో టీడీపీ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తనకి.. బినామీల పేరుతో జేసీ బ్రదర్స్ కు కొన్ని ని వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు నిజాలు బయటకు వచ్చినట్లు సమాచారం ఉంది. వీటన్నిటికీ కూడా సాక్షాలు సేకరించి నేను పిటిషన్ వేశాను అని తెలిపాడు. చాల సంవత్సరాల  తర్వాత మళ్లీ కోర్టు విచారణ కొనసాగుతుంది అని తెలిపారు. ఈ కేసులో జేసీ కొడుకు, కోడలికి హైకోర్టు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది అని మరోసారి గుర్తు చేశాడు. గతంలో చంద్రబాబు కూడా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దర్యాప్తు చేయిస్తామని తెలిపారు.. దర్యాప్తు జరిగితే  ఎటువంటి సమస్యలు వస్తాయని ముందే భయపడి ఆ భయంతోనే జేసీ బద్రర్స్ టీడీపీలో చేరారని ఆరోపణలు చేయడం జరిగింది.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: