ప్రియాంకా రెడ్డి హత్య ఘటన మరిచిపోకముందే , శంషాబాద్ శివారులో మరొక యువతిని దారుణంగా హత్య చేసి దహనం చేసిన ఘటన వెలుగు చూసింది . రాష్ట్రం లో వరుసగా చోటు చేసుకుంటున్న యువతులపై అత్యాచార ఘటనల పై ప్రజల్లో నిరసన పెల్లుబికుతోంది . ప్రియాంకారెడ్డి , వరంగల్ లో మానస పై అత్యాచార ఘటన మరిచిపోకముందే, శంషాబాద్ శివార్లలో సిద్దులగుట్ట రోడ్డులో బంగారు మైసమ్మ ఆలయం పక్కన ఓ మహిళ మృతదేహాన్ని శుక్రవారం రాత్రి స్థానికులు గుర్తించారు .
ప్రియాంకారెడ్డి పై లారీ డ్రైవర్లు పథకం ప్రకారం అత్యాచారం చేసి , హత్య చేసి శవాన్ని కన్పించకుండా చేసేందుకు ఆమె శవాన్ని పెట్రోల్ పోసి దహనం చేసిన విషయం తెల్సిందే . ఇక వరంగల్ హన్మకొండ లో మానస అనే యువతి పై ప్రియుడే, కారులో అత్యాచారం చేసి తీవ్ర రక్తస్రావం వల్ల మరణించగా , సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు . ఈ రెండు సంఘటనలు గురువారం చోటుచేసుకోగా , ఇక శుక్రవారం శంషాబాద్ సిద్దులగుట్ట రోడ్డులో యువతి శవాన్ని స్థానికులు గుర్తించగా ఆమె పై అత్యాచారం చేసి , హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు . సదరు యువతిపై అత్యాచారం చేసి హత్య చేసిన అనంతరం కిరోసిన్ పోసి తగులబెట్టినట్లు తెలుస్తోంది . సదరు యువతిపై ఎక్కడో అత్యాచారం జరిపి , హత్య చేసి ఇక్కడకు తెచ్చి శవాన్ని దగ్ధం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు .
గుర్తుపట్టడానికి వీల్లేకపోవడం తో కొన్ని ఆధారాలను పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది . ఘటన జరిగిన ప్రదేశం పూర్తి నిర్మానుష్య కావడంతో ఆధారాలు సేకరించడం పోలీసులకు కష్టంగా మారినట్లు సమాచారం . శవం కాలిపోతున్న సమయం లో స్థానికులు సెల్ ఫోన్ లో చిత్రీకరించి పోలీసులకు సమాచారం అందించడం తో , అదే వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది .