కన్నడ నాట రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ లో నిజంగానే గంట గంటకూ ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అస్సలు ఆత్రం ఆపుకోలేక పోయిన తన బుద్ధితో అడ్డంగా బుక్ అయిపోయాను అని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఇప్పుడు నెత్తీ నోరు బాదుకుంటున్నాడు. గత ఆరు నెలల కాలంలో  కర్ణాటకలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తమంతట తాముగా వచ్చి పరిచయం చేసుకున్న వెంటనే  ఆత్రాన్ని ఆపుకోలేకపోయి... పరిచయం అయిన యువతితో పడక సుఖం కోసం 24 గంటలు కూడా ఆగలేకపోయిన ఆ ఎమ్మెల్యే ఇప్పుడు పోలీసుల ఎదుట ఉన్నాడు.

 

కర్ణాటక  హనీట్రాప్ కేసులో అరెస్టు అయిన నిందితుడు రాఘవేంద్ర అలియాస్ రఘు - రాజేష్ మరో ఇద్దరు యువతులు అక్టోబర్ 12న బెంగళూరులోని ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గరకు వెళ్లి తాము టార్గెట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యేని పరిచయం చేసుకున్నారు. తరువాత బీజేపీ ఎమ్మెల్యేను మాయ మాటల్లో దింపారు. ఎమ్మెల్యే తో పరిచయం చేసుకున్న యువతి అక్కడే అతనికి చిలిపి సైగలు చేసింది. ఆ యువతి ఎమ్మెల్యే మొబైల్ ఫోన్ నెంబర్ తీసుకుంది. అంతటితో ఆగని సదరు యువతి అదే రోజు రాత్రి ఎమ్మెల్యేకు ఫోన్ చేసి తాను ఒంటరిగా ఉన్నానని రావాలని చెప్పిందట. ఇంకేముంది మరుసటి రోజు  మద్యాహ్నం 4 గంటలకే  వస్తానని ఎమ్మెల్యే సమాధానం చెప్పాడు అట.

 

హోటల్ లోని యువతి ఉన్న గదిలోకి వెళ్లి అక్కడ అప్పటికే అర్దనగ్నంగా ఉన్న యువతి ఎమ్మెల్యేను రెచ్చగొట్టి ముగ్గులోకి దింపింది అట. ఈ క్రమంలో ఏ మాత్రం ఆగలేకపోయిన ఆ ఎమ్మెల్యే - యువతితో రాసలీలల్లో మునిగిపోయాడు. ఇంకేముంది యువతితో సదరు ఎమ్మెల్యే రాసలీలలు సాగిస్తున్న సమయంలో అదే గదిలో ఏర్పాటు చేసిన రహస్య కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

 

ఆ వెంటనే నిందితులు ఎమ్మెల్యేను బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారట. రూ.50 కోట్లు ఇస్తే ఒకే లేకపోతే లేదంటే సదరు వీడియోలను టీవీ ఛానెళ్లకు ఇస్తామంటూ బెదిరింపులకు దిగారట. దీంతో బిక్కచచ్చిపోయిన ఎమ్మెల్యే... అంత ఇచ్చుకోలేనని రూ.10 కోట్లు అయితే చూస్తానంటూ బేరాలు ఆడాడట. ఈ ఉదంతాన్ని వేరెవరో పోలీసులకు చెప్పలేదు. స్వయంగా సదరు బాధిత ఎమ్మెల్యేనే చెప్పడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: