తాజాగా హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ లో ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్ సమావేశం అవ్వడం జరిగింది. సీఎం కేసీఆర్ ఆత్మీయ సమావేశానికి 97డిపోల నుంచి కార్మికులు తరలి రావడం జరిగింది. ప్రతి డిపో నుంచి వచ్చిన ఐదుగురు ఆర్టీసీ కార్మికుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఈ భేటీకి ముందు సీఎం కేసీఆర్ కార్మికులతో కలిసి భోజనం కూడా చేయడం జరిగింది . అనంతరం సమావేశమైన ఆర్టీసీ లో పరిస్థితులపై చర్చ కొనసాగించడం జరిగింది.
తెలంగాణ ఆర్టీసి కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ తెలిపారు. ఆర్టీసి కార్మికులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో భేటి అయిన విషయం అందరికి తెలిసిందే కదా. ఈ సందర్బంగా కార్మికులకు శుభవార్త చెబుతూ సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ కీలక నిర్ణయాలు ఏమిటో చూద్దామా మరి... 52 రోజుల సమ్మె కాలానికి జీతాల చెల్లింపు చేస్తాము అని తెలిపారు. సెప్టెంబర్ నెల వేతనాలు సోమవారం విడుదల చేస్తాము అని తెలియచేయడం జరిగింది.
ఆర్టీసి కార్మికుల పదవీ విరమణ కూడా వయస్సు 60 ఏళ్లకు పెంపు చేయడం కూడా చేస్తాము అని తెలియచేయడం జరిగింది. డిపోలల్లో మహిళల కోసం ప్రత్యేక వసతులు కల్పిస్తాము అని తెలిపారు. ఆర్టీసిని లాభాల్లోకి తీసుకు వస్తే సింగరేణి తరహా బోనస్ లు. ప్రయాణికులు టికెట్ తీసుకోకపోతే కండక్టర్లకు విధిస్తున్న జరిమానాను ఇక నుంచి ప్రయాణికుల నుంచి వసూలు చేయాలని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది.