దేశవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. ఏపీ, తెలంగాణ టు సౌత్... నార్త్ ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ప్రాంతం అయినా దేశంలో మ‌హిళ‌ల‌కు సేఫ్ కాద‌న్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది. హైద‌రాబాద్‌, చెన్నై, ముంబై, క‌ల‌క‌త్తా, బెంగ‌ళూరు టు ఢిల్లీ ఇలా చెప్పుకుంటూ పోతే మెట్రో న‌గ‌రాల్లో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అకృత్యాలు, అత్యాచారాల‌కు అంతే లేదు. మ‌హిళ‌ల‌కు బ‌య‌టే కాదు ఇంట్లో వ్య‌క్తుల నుంచి కూడా ర‌క్ష‌ణ లేకుండా పోతోంది.

 

సొంత మామ‌లు, బావ‌ల చేతుల్లో కూడా అత్య‌చారాల‌కు గుర‌వుతోన్న అమ్మాయిలు ఉన్నారు. ఎందరో అమాయక మహిళలు బంధువుల చేతుల్లోనే మోసపోయి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ఓ వివాహిత‌పై సొంత భ‌ర్త అన్నే దారుణంగా రేప్ చేశాడు. ఇదే దారుణం అనుకుంటే ఆమె ఈ విష‌యాన్ని భ‌ర్త‌కు చెపితే భార్య‌కు అండ‌గా నిల‌వాల్సింది పోయి ఆమెకు ట్రిఫుల్ త‌లాక్ చెప్పి వ‌దిలించుకున్నాడు.

 

ఈ సంఘ‌ట‌న పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి. రాంపూర్‌ పరిధిలోని డోనక్‌పురి తాండాకు చెందిన మహిళకు ఓ వ్యక్తితో ఏడు సంవత్సరాల క్రితం డాడియల్‌కు చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. స‌ద‌రు బాధితురాలి భ‌ర్త ఢిల్లీలో ఓ హోట‌ల్ నిర్వ‌హిస్తున్నాడు. దీంతో ఆమె త‌న ఇద్ద‌రు పిల్ల‌లుతో క‌లిసి స్థానికంగా నివాసం ఉంటోంది. ఇదే అలుసుగా తీసుకున్న ఆమె బావ ఓ రోజు ఎవ్వ‌రూ లేని టైం చూసుకుని ఆమెపై రేప్ చేశాడు.

 

బాధితురాలు ఎంత‌కు లొంగ‌క‌పోవ‌డంతో ఆమెను బెదిరించి మ‌రీ రేప్ చేశాడు. ఈ విష‌యాన్ని ఎవ్వ‌రి చెప్ప‌వ‌ద్ద‌ని మ‌రీ ఆమెపై ప‌లుసార్లు రేప్ చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు బాధ‌ను భ‌రించిన ఆమె ఎట్ట‌కేల‌కు ధైర్యం చేసి ఈ విష‌యాన్ని భ‌ర్త‌కు చెప్పింది. అత్యాచారానికి గురైన భార్యతో కాపురం చేయబోనంటూ ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పేసి ఇంట్లో నుంచి గెంటేశాడు. దీంతో బాధితురాలు తన పుట్టింటి వారి సాయంతో అజీమ్‌ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

బావ త‌న‌పై రేప్ చేశాడ‌ని చెపితే త‌న అత్త‌, మామ‌లు కూడా అత‌డికే స‌పోర్ట్ చేశార‌ని.. ఇప్పుడు భ‌ర్త కూడా త‌న‌న ఇంట్లో నుంచి గెంటివేశాడ‌ని ఆమె ఆరోపించింది. దీంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: