మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వరుస అట్టర్ ఫ్లాప్ సినిమాల తర్వాత ఎట్టకేలకు చిత్రలహరి సినిమాలో నటించి మంచి హిట్ సాధించాడు. ఇక ఆ విజయంతో ప్రస్తుతం ఫుల్ జోష్ లోనే ఉన్న మన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ 'ప్రతిరోజూ పండగే' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతిరోజూ పండగే చిత్రంలో.. రాశి ఖన్నా సాయి ధరంతేజ్ ని ఆటపట్టించే మరదలి పాత్రలో నటిస్తోంది. అయితే నిన్న అనగా నవంబర్ 30న రాశి ఖన్నా తన 29వ పుట్టిన రోజు వేడుకలను చిత్ర యూనిట్ తో జరుపుకుంది.

https://mobile.twitter.com/IamSaiDharamTej/status/1200710500419432449?ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Etweet

అయితే ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్....'జన్మదిన శుభాకాంక్షలు రాశీ ఖన్నా జీ. ముందు చెయ్యి తియ్యి అమ్మా. మీ ఫ్యాన్స్ నాపై అరుస్తున్నారు #హాథ్ నికాలో #చెయ్యి తీ #సోలో బ్రతుకే సో బెటర్' అంటూ ట్వీట్ చేశాడు.

అలా అనడానికి కూడా ఒక కారణముంది. ఎందుకంటే.. సాయి ధరమ్ తేజ్, రాశిఖన్నాను హత్తుకొని ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియా తెరపైకి వచ్చింది. ఇక ఇది చూసిన నెటిజన్లు... 'చెయ్యి ఎందుకు వేశావు? చెయ్ తీయ్' అంటూ బాగా ట్రోల్ చేస్తున్నారు.

ఇక అవన్నీ చదివిన ధరమ్ తేజ్ ట్విట్టర్ వేదికగా.. మంచి రిప్లయ్ ఇచ్చారు.. మీ నుంచి వస్తున్న ఈ స్పందనలు నన్ను ఆలోచించేలా చేస్తున్నాయి. సినిమాలో భాగంగా అని తెలిసి కూడా.. మీ అభిమాన నటిపై చేయి వేస్తే చెయ్యి తీయ్‌ అని అన్నారు. ఇంతే ప్రేమ, జాలితో మన చుట్టూ ఉండే అమ్మాయిలను చూడగలిగితే యువ వైద్యురాలు లాంటి బాధితులు మన సమాజంలో ఉండరు కదా?’ అని రాసారు.
https://mobile.twitter.com/IamSaiDharamTej/status/1200980699185942528?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed&ref_url=https%3A%2F%2Fd-21161212101737376942.ampproject.net%2F1911121900560%2Fframe.html
దీంతో ట్రోల్స్ కు ఇచ్చిన పైన రిప్లయ్ కు మంచి స్పందన వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: