ఓవైపు దిశ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ.. అంత కంటే దారుణమైన అరాచకాలు వెలుగు చూస్తున్నాయి. ఈ దేశంలో మహిళకు రక్షణ లేదా అన్న ఆక్రోశం వినిపిస్తున్న వేళలోనే ఈ దారుణాలు నోటమాట రాకుండా చేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ లో ఓ కామ పిశాచి ఏకంగా ఓ మహిళపై కామ వాంఛ తీర్చుకునేందుకు ఆమెను చంపేశాడు. ఆ తర్వాత మృతదేహంతో సెక్స్ చేసి దాన్ని మళ్లీ వీడియో కూడా తీసుకున్నాడు.

 

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర ప్రదేశ్‌లోని ఇబ్రహీంపుర్‌లో గత నెల 24న ఈ దారుణం జరిగింది. 38 ఏళ్ల నసీరుద్దీన్ అనే కామ పిశాచి ఓ వివాహితపై కన్నేశాడు. ఎలాగైనా ఆమెను అనుభవించాలనుకున్నాడు. ఎలాగూ ఆమె తన కోరిక తీర్చే అవకాశం లేదని తేల్చుకున్న ఆ కామ పిశాచి మృగంగా మారాడు. ఆమె ఇంట్లో ప్రవేశించి ఆ మహిళపై అత్యాచారం చేయబోయాడు.

 

ఇది గమనించి అడ్డు వచ్చిన ఆమె భర్తను చంపేశాడు. పసిబిడ్డ అని కూడా చూడకుండా ఆ మహిళకు చెందిన నాలుగు నెలల పిల్లాడినీ పొట్టనపెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ మహిళను కూడా చంపేశాడు. ఆ తర్వాత తీరికగా చనిపోయిన మహిళ మృతదేహంతో ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నాడు. దాదాపు మూడు గంటల పాటు శృంగారం చేశాడు. అంతే కాదు ఆ రాక్షసుడు.. ఆ జుగప్సాకరమైన దృశ్యాన్ని వీడియో కూడా తీసి పెట్టుకున్నాడు.

 

ఆ ఘటన జరిగిన తర్వాత ఆధారాలు దొరక్క పోలీసులు కేసు దర్యాప్తులో మునిగిపోయారు. ఆ తర్వాత నసీరుద్దీన్ తాను చేసిన ఘన కార్యాన్ని చెబుతూ శవంతో సెక్స్ చేసిన వీడియోని తన మరదలికి చూపించాడు. భయభ్రాంతులకు గురైన ఆమె పోలీసులకు సమాచారం అందించడంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి మానవ మృగాలు ఇంకెన్ని ఉన్నాయో దేశంలో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: