బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ ...టీఆర్ఎస్ ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. యాదాద్రి కి ఒక గొప్ప విశిష్టత కలిగివుంది ,ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఇందులో అపచారాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. బుధవారం లక్ష్మణ్ మీడియాతో హైందవ ధర్మానికి ముప్పుగా సీఎం కేసీఆర్ మారారని, బొట్టు పెట్టుకొని యాగాలు, పూజాలు చేస్తే భక్తునిగా మారలేరని కేసీఆర్ను విమర్శించారు. యాదాద్రిలో కేసీఆర్ను దేవుడి కంటే ముందు దర్శించుకునేందుకు చిత్రాలు వేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీ నరసింహ స్వామిని ఉల్లితో చెక్కడం దారుణమన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు శిల్పాలు చెక్కుతున్నట్లు అధికారులే స్పష్టం చేశారని లక్ష్మణ్ తెలిపారు.
అంతే కాకుండా లక్ష్మణ్ యాదాద్రిలో కేసీఆర్ ఆధ్యాత్మికాన్ని అడ్డు పెట్టుకొని రియల్ ఎస్టేల్ వ్యాపారానికి తెరలేపారని ఆరోపించారు. కేసీఆర్కు యాదాద్రి అభివృద్ధి కంటే రియల్ ఎస్టేట్పై మక్కువ ఎక్కువైందని, ఆయన మహా అపచారానికి పాల్పడుతున్నారని యాదాద్రిలో అభిప్రాయపడ్డారు. ఒక గజినీలా కేసీఆర్ తయారయ్యారని విమర్శించారు. సీఎం యాదాద్రి జరుగుతున్న అపచారంపై వివరణ ఇవ్వాలని డిమండ్ చేశారు.
సినిమా ఆర్ట్ డైరెక్టర్తో గుడి పునర్నిర్మాణం పేరుతో అవినీతి పనులు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ చింతమడకకు కేంద్రం ఎంత నిధులు ఇచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది’ అని ప్రశ్నించారు. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ, బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కేటీఆర్కు బీజేపీ లక్ష్మణ్ సవాల్ విసిరారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాస్త బ్రాందీ గా మారిందని ఆరోపించారు. హైటెక్ సిటీ నుంచి మాదాపూర్ వరకు కోవొత్తుల ర్యాలీ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దిశా ఘటన నిందితులను ప్రభుత్వం కచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా ముఖ్యమంత్రి తన ఇంటికి వెళ్లి కనీసం కుటుంబ సభ్యులను పరామర్శించలేదని విమర్శించారు.