ముఖ్యమంత్రి గ యస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పతకాలు ప్రవేశ పెడుతూనే ఉన్నారు.ఆంగ్ల విద్య అంటూఎన్నో మార్పులు తెచ్చే ప్రయత్నం చేసారు వాటితో పాటు పారిశ్రామిక అభివృద్ధి జరగడానికి కూడా కొత్త కొత్త ఫ్యాక్టరీలకు అనుమతి లు ఇచ్చాడు దీనితో నిరుద్యోగులకు కొందరికైనా ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. ఆ కార్యక్రమం లో భాగంగా నే . అనంతపురం జిల్లాలోని పెనుకొండలో గల కియా ఫ్యాక్టరీ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు.
గురువారం ఉదయం 11 గంటలకు కాళ్ళ కియా ఫ్యాక్టరీకి చేరుకున్నారు సీఎం ..సీఎం చేరుకున్న కాసేపటి తర్వాత ముక్యమంత్రి గారికి కాసేపటి తర్వాత అక్కడ ఉన్న కియా యాజమాన్యంతో సమావేశం ఏర్పరిచారు.ముక్యంగా ఆయన.సమావేశం లో పరిశ్రమ వివరాల గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగ జగన్ మోహన్ గారు పరిశీలించారు.
ప్రారంభోత్సవం సందర్భంగా కియా ఫ్యాక్టరీ డాక్యుమెంటరీ చిత్రాన్ని జగన్ వీక్షించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారి కృషివల్లే దక్షిణ కొరియా సంస్థ ఏపీలో కియా ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే ఈ కార్యక్రమం తర్వాత ముఖ్యమంత్రి గారు అనంతపురం జిల్లా ప్రజా ప్రతినిధులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రజా ప్రతినిధుల సమావేశం లో ఆయన అనంతపురం జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై సీఎం ఆరా తీయనున్నారు.
అలాగే వాటితో పాటు ఇంకా కొన్ని ముఖ్య అంశం లు అయిన అనంతపురం-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ పై న కూడా చర్చగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాగా సోమందేపల్లి మండలం గుడిపల్లిలో ఎలక్ట్రికల్ బస్సుల తయారీ కొరకు పరిశ్రమకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇదివరకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వీరవాహన్ సంస్థ కు 120 ఎకరాల భూములు కేటాయింపు కూడా పూర్తి అయ్యాయి.