దిశను పాశవికంగా అత్యాచారం చేసి చంపిన రేపిస్టులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై అంతటా హర్షం వ్యక్తమవుతోంది. అన్ని వర్గాల వారు పండుగ చేసుకుంటున్నారు. ఇక ముఖ్యంగా టాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తమ సంతోషం పంచుకుంటున్నారు. శంషాబాద్‌ వద్ద దిశ హత్యాచార కేసును సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు.. పోలీసులపై దాడి చేయడంతో.. ఆత్మ రక్షణ కోసం.. వారు నలుగురు నిందితులపై ఎన్‌ కౌంటర్ చేసినట్టు తెలుస్తోంది.

 

ఈ ఎన్ కౌంటర్ పై టాలీవుడ్ సెలబ్రెటీలు సోషల్ మీడియాలో సాహో.. సజ్జనార్‌ అంటూ.. పోస్టులు పెడుతున్నారు. ఈ ఎన్ కౌంటర్ తో దిశ ఆత్మకు శాంతి చేకూరిందని జూనియర్ ఎన్టీఆర్ పోస్టు చేసారు. దిశ కుటుంబానికి న్యాయం జరిగింది, నిందితులను చంపిన బుల్లెట్ దాచుకోవాలని ఉందంటూ మంచు మనోజ్ స్పందించారు. ఇక దిశకు తగిన న్యాయం జరిగిందని అక్కినేని నాగార్జున అభిప్రాయపడ్డారు.

 

ఇక మరో హీరో నాని .. ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి.. వాడు పోలీసోడై ఉండాలి అంటూ పోస్టు పెట్టారు. ఎన్‌కౌంటర్‌పై పోలీసులకు అభినందనలంటూ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది. రేపిస్టులకు ఖచ్చితంగా ఇలాంటి శిక్షలు పడాలని మరో నటి మంచు లక్ష్మీ ఫీలయ్యింది. నిందితులకు తగిన శిక్ష పడిందని నటులు రాజశేఖర్, జీవిత అన్నారు.

 

ఇక దర్శకుడు హరీశ్ శంకర్ ఇంకాస్త భిన్నంగా స్పందించారు. మా సినిమా టిజర్లు, ట్రైలర్లు ట్రెండింగ్ కాదు. ఈ ఎన్ కౌంటర్ ట్రెండింగ్ అవ్వాలని అభిలషించారు. ఈ ఎన్ కౌంటర్ ను చాటింపు వేసి చెప్పాలన్నారు. ఆయన తన ప్రొఫైల్ ఫొటో తీసి సజ్జనార్ ఫొటో పెట్టుకున్నారు. ఇక సమంత ఏమన్నారంటే.. తెలంగాణ పోలీసులకు సెల్యూట్ .. భయానికి సరైన సొల్యూషన్ దొరికింది. అప్పుడప్పుడు ఇదే పరిష్కారం.. అంటూ స్పందించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: