హైదరాబాద్ లో జరిగిన దిశ హత్యాచార దుర్ఘటన దేశం మొత్తం ని కుదిపి వేసింది .దిశా నిందితులఫై ఎన్కౌంటర్ జరిగి వాళ్ళుచనిపోవడం జరిగింది . కానీ ఆడవారిపై , చిన్నారులపై లైంగిక దాడులమాత్రం ఆగటం లేదు ఎక్కడో ఒక్కచోట జరుగుతూనే ఉన్నాయ్ . త్రిపురలో 17 ఏళ్ల బాలికపై నెలన్నర పాటు లైంగిక దాడికి పాల్పడిన యువకుడు చివరకు ఆమెను సజీవ దహనం చేసి చంపిన విషయం బయటకు వచ్చింది .ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు అజయ్ రుద్ర పౌల్, అతని తల్లి అనిమ రుద్ర పౌల్ (59)లను పోలీసులు అరెస్ట్ చేశారు.
బాధితురాలు కాలిన గాయాలతో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిందని పోలీసులు తెలిపారు. కాగా తమ కుమార్తెను అక్టోబర్ 28న ఖవోసి జిల్లా కల్యాణ్పూరిలోని తమ ఇంటి నుంచి అజయ్ కిడ్నాప్ చేశాడని, శాంతిర్ బజార్లోని తన ఇంటికి తీసుకువెళ్లాడని బాధితురాలి తండ్రి ఫిర్యాదుచేసినట్లు పోలీసులు తెలిపారు .
బాలికపై లైంగిక దాడి చేసిన అజయ్ ఆమెను నేను పెళ్లిచేసుకోవాలంటే రూ ఐదు లక్షలు కట్నం ఇవ్వాలని అడిగాడు అడిగిన కట్నం లో కొంచెం ఇవ్వడం తో డిసెంబర్ 11న ఆమెను వివాహం చేసుకుంటానని అజయ్ చెప్పాడు .. అయితే కట్నం విషయంలో అజయ్ తన తల్లికి గొడవ అయింది .ఈ క్రమంలో బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించాడని పోలీసులు తెలిపారు .
బాలిక మృతితో ఆమె కుటుంబ సభ్యులు, స్ధానికులు అజయ్, అనిమాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ లో వారిపై కేసు పెట్టారు .. బాధితురాలి నుంచి మరణ వాంగ్మూలం నమోదు చేసుకున్నామని, కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారికీ ఇంతకుముందే బంధుత్వం ఉంది అని అజయ్ బంధువు ఒకరు బాధితురాలి కుటుంబ సభ్యులను వివాహం చేసుకోగా, అప్పటి నుంచి వారు ఒకరికి ఒకరు పరిచయమయ్యారని, అక్కడి స్థానికులు చెప్తున్నారు.