దేశంలో రోజురోజుకు మందు తాగి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య ఎక్కువై పోతున్నది. మందుబాబుల డ్రైవింగ్ వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా..ఎందరో ప్రాణాలు కోల్పోతున్నా మందుబాబుల తీరు ఏ మాత్రము మారడం లేదు. చట్టాలు ఎంత కట్టుదిట్టం చేసిన, జైలు శిక్షలు కఠినముగా విధిస్తున్నా...భారీగా జరిమానాలు విధిస్తున్న కూడా వారు తప్పతాగి వాహనాలు నడపడం మానడం లేదు.ఈ మందు బాబు ల వల్ల ప్రమాదాలు ఎలా అరికట్ట వలయును సరిగా ఎవరికీ అర్థం కావడం లేదు. దాదాపు ప్రతి రోజు 73 మంది డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసుల చేతులో దొరికి పోవడము ఇందుకు నిదర్శనం. గడచిన 11 నెలల కాలములో సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు జరిపిన తనిఖీల్లో భాగంగా సుమారు 24,134 మంది పట్టుబడ్డారు. వీరిలో 6564 మందికి జైలు శిక్ష పడింది. అయినా డ్రంకన్ డ్రైవర్ల విస్మయం వ్యక్తమవుతోంది.
మద్యం తాగి ఉన్నటువంటి వారు ఎటువంటి వాహనాలు నడపొద్దని ఎవరైనా చెబితే మందుబాబులకు కోపం వస్తుంది ఆ సమయములో ఎట్లాగయినా సరే వాహనం నడిపి తీరాల్సిందేనని ఉబలాటపడుతుంటారు కొందరు. ఈ తాగి నప్పుడు డ్రైవింగ్ చేస్తున్న వారు ఒక్కో సమయములో రహదారుల్లో వాహనాలపై దూసుకెళుతూ పోలీసులకు దొరికిపోతున్నారు ఈ సంవత్సరము జనవరి నుంచి నవంబర్ వరకు నమోదైన కేసులే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ నెలాఖరు వరకు 24,134 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు కావడము విశేషము.. అంటే నెలకు 2,194 మంది పట్టుబడితే...రోజుకు సరాసరిన 73 మంది ట్రాఫిక్ పోలీసులకు చిక్కుతున్నారు. జైలు శిక్షలను పరిశీలించడం చూస్తే ఆయా కమిషనరేట్ల పరిధిలో 11 నెలల్లో 6,564 మంది కటకటాల పాలు అవ్వడం జరిగింది.
ఒక , నెలకు 596 మంది అంటే రోజుకు సగటున 19 మందికి సంకెళ్లు పడుతున్నట్లు మన గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి.. రాత్రి వేళల్లో పోలీసులు నిర్వహిస్తున్న ఆకస్మిక దాడులలో మందుబాబులు ఎక్కువ సంఖ్యలో పట్టుబడిపోతున్నారు. ఇన్ని కేసులు నమోదు చేస్తున్నా వారిలో మార్పు రాకపోవడం, విస్మయము, ఆందోళన కలిగిస్తోంది. అనేక వృత్తుల వారీగా డ్రంకన్ డ్రైవర్ల జాబితాను పరిశీలిస్తే ప్రైవేట్ ఉద్యోగ స్తులు ఉండడము గమనార్హం. . రెండవ స్థానంలో స్వయం ఉపాధి పొందేవారు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వ్యాపారం చేసుకునేవారు, కాలేజీ విద్యార్థులు ఉండగా, చివరి స్థానంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా అధికంగా నే ఉండటం గమనార్హం. ముఖ్యముగా డ్రంకెన్ డ్రైవ్ చేసే వాళ్ల వల్ల ఎంతోమంది అమాయకుల జీవితాలు బలిఅవుతున్నాయి .