ఏపీ విప‌క్ష నాయ‌కుడు, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇప్పుడు ఏదో కొత్త బాధ చుట్టు ముట్టింది. నిన్న‌టి వ‌ర కు పార్టీ ఓట‌మి, నాయ‌కులు మాట విన‌క‌పోవ‌డం, పార్టీని ఎలా ముందుకు తీసుకు వెళ్లాలో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొన‌డంతో ఆయ‌న అల్లాడిపోయారు. ఇక‌, ఇప్పుడు దీనికి మించిన బాధ ఆయ‌న‌లో వ్య‌క్త‌మ‌వు తోంది. అదే.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లో అధికార ప‌క్షం చేస్తున్న మాట‌ల యుద్ధం, దీనికి తోడు తాను మాట్లాడేందుకు మైకు ల‌భించ‌క‌పోవ‌డం. ఈ రెండు ప‌రిణామాలు కూడా తాజాగా బాబుకు ఇబ్బంది క‌రంగా మారాయ‌నేది వాస్త‌వం.

 

అసెంబ్లీలో ఆయ‌న ఏం మాట్లాడ‌ల‌న్నా.. మైకు ల‌భించ‌డం లేద‌నేది టీడీపీ నేతల మాట కూడా. నిజ‌మే నా.. కాదా.. అనేది కొద్ది సేపు ప‌క్క‌న పెడితే.. బాబు మాత్రం త‌న‌కు మైకు ల‌భించ‌క‌పోవ‌డంతో ఏకంగా ఈ రోజు స్పీక‌ర్‌పై నానాయాగీ చేసేశారు. మ‌ర్యాద‌గా న‌డుచుకో..! అంటూ వార్నింగ్ కూడా ఇచ్చేశారు. దీంతో స‌భ మొత్తం ఒక్క‌సారిగా గ‌రంగ‌రంగా మారిపోయింది. దీంతో చంద్ర‌బాబు ముఖంలో క‌ళ త‌ప్పిపోయింది. క‌ట్ చేస్తే.. ఇదే విష‌యంపై వైసీపీ నాయ‌కుల‌ను ప‌ల‌క‌రిస్తే.. వారి నుంచి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు వినిపిస్తున్నా యి. గ‌తంలో అంటే చంద్ర‌బాబు హ‌యాంలో జ‌రిగిన స‌భ‌ల‌ను రీళ్లు రీళ్లుగా తీసి మ‌రీ వారు చూపిస్తు న్నారు.

 

``అప్పుడు మ‌మ్మ‌ల్ని ఆడేసుకున్నారుగా!!``- అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాదు, గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో క‌నీసం జ‌గ‌న్‌కు మైకు ఇచ్చేందుకు కూడా అనేక అడ్డంకులు సృష్టించార‌ని, ఇప్పు డు మా నాయ‌కుడు జ‌గ‌న్ ఎక్క‌డా అడ్డు చెప్ప‌కుండానే చంద్ర‌బాబుకు స‌హ‌క‌రిస్తున్నార‌ని వారు అంటు న్నారు. అంతేకాదు, అప్ప‌ట్లో మేం ఇంకా ఎక్కువ‌గానే ఇబ్బంది ప‌డ్డామ‌ని, ఇప్పుడు ఈ మాత్రానికే ఇంత యాగీ చేయాలా? అని వారు సైతం ప్ర‌శ్నిస్తున్నారు. ఇక‌, సోష‌ల్ మీడియాలోనూ చంద్ర‌బాబుకు వ్య‌తిరేకం గానే పోస్టులు ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. సీనియ‌ర్ మోస్ట్ అయిన చంద్ర‌బాబు సంయ‌మ‌నం పాటించాల‌ని స్పీక‌ర్‌ను టార్గెట్ చేయ‌డం ఏమంత బాగాలేద‌ని అంటున్నారు. మ‌రి బాబు ఏమంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: