పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి గురించి ప్రతి ఒక్కరికి అంతో ఇంతో పరిచయం ఉంటుంది. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలను పేర్కొన్నారు. అందులో చెప్పిన విధంగానే దాదాపుగా జరుగుతున్నాయి. పురుషులతో సమానంగా ఆడపిల్లలు కూడా ఎదుగుతారని, ఇంకా చెప్పాలి అంటే ఆడపిల్లలు పురుషులను మించేలా ఎదుగుతారని అందులో చెప్పారు.
పెళ్లి విషయంలో కూడా అనేక మార్పులు వస్తాయని చెప్పిన సంగతి తెలిసిందే. కన్యాశుల్కం పోయి వరకట్నం వస్తుందని, ఈ వరకట్నం కూడా క్రమంగా తగ్గిపోయి తిరిగి కన్యాశుల్కం వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో పేర్కొన్నారు. కొంతమంది నాలుగైదు పెళ్లిళ్లు చేసుకుంటే, మరికొందరు పెళ్లిళ్లు కాక అలానే ఉండిపోతారని కూడా బ్రహ్మంగారు పేర్కొన్నారు.
ఇక ఇదిలా ఉంటె, మధ్యప్రదేశ్ లోని బింద్ జిల్లాలోని ఓ గ్రామంలో విచిత్రం చోటు చేసుకుంది. బింద్ జిల్లాలోని గుడవాలి గ్రామానికి చెందిన 35 ఏళ్ల దీపు పరివార్ అనే వ్యక్తి తొమ్మిదేళ్ల క్రితం వినీత అనే ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఓ మగపిల్లవాడు ఉన్నారు. ఇప్పుడు వినీత ఆ గ్రామానికి సర్పంచ్. పైగా కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నది.
దీంతో వినీత మరో పెళ్లి చేసుకోవాలని పరివార్ ను కోరింది. వినీత చెల్లెలైన రచన తో వివాహాన్ని నిశ్చయం చేసింది వినీత. అయితే, ఆ పెళ్ళిలో ఓ విచిత్రం జరిగింది. మొదట రచన మెడలో తాళికట్టిన పరివార్.. ఆ తరువాత వినీత మెడలో కూడా మరోసారి తాళికట్టాడు. దండలు కూడా మార్చుకున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, పోలీసులు మాత్రం దీనిపై తమకు ఎలాంటి సమాచారం కానీ, ఎలాంటి కంప్లైంట్ కానీ లేదని అంటున్నారు.