పవన్ కల్యాణ్.. ఈ పేరు చెబితే కొన్ని లక్షల హృదయాలు ఆనందంతో కొట్టుకుంటాయి. తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో పవన్ కల్యాణ్ ఒకరు. ఆయన కోసం ప్రాణం ఇచ్చేంత పిచ్చి అభిమానులు కూడా ఉన్నారు. అందుకే ప్రత్యేకంగా పవనిజం అంటూ ఓ పదం కూడా పుట్టుకొచ్చింది. సినీ నటుడుగా అష్ట అయిశ్వర్యాలు అనుభవించిన పవన్.. కోటీశ్వరుడన్న సంగతి తెలిసిందే.

 

కోట్ల రూపాయలు పారితోషకం అందుకునే ఆ నటుడు.. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేస్తున్నానంటున్నాడు. కానీ మొన్నటి ఎన్నికల్లో పాపం చాలా నిరాశ చెందారు. కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే స్థానం గెలుచుకున్నారు. తాను కూడా స్వయంగా ఓడిపోయారు. అలాంటి పవన్ ఇప్పుడు మరింత చురుగ్గా ఏపీ రాజకీయాల్లో పాల్గొంటున్నారు. ఏదో ఒక ఇష్యూతో జనంలోకి వెళ్తున్నారు.

 

తాజాగా ఆయన కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష నిర్వహించారు. జనం కోసం అన్నీ వదులకుని వచ్చానని చెప్పే పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా అభిమానులను ఆశ్చర్యపరిచారు. తానూ సాధారణ వ్యక్తినేనని పలుమార్లు చెప్తూ వచ్చే పవన్ కల్యాణ్ మరోసారి తనలోని సాదాతనాన్ని నిరూపించుకున్నారు. రైతుల కోసం కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష చేసిన పవన్.. దీక్ష అనంతరం రాజమండ్రికి వెళ్లాల్సిఉంది. అయితే రాజమండ్రి ఫ్లైట్ లేట్ అయ్యింది. అందువల్ల ఆయన విమానాశ్రయం వెలుపలే ఓ సాధారణ వ్యక్తిలా పడుకున్నారు.

 

ఉదయం నుంచి దీక్షలో బాగా అలిసిపోయిన పవన్.. విమానాశ్రయం వెలుపల ఓ సాదాసీదా వ్యక్తిలా అన్నీ మరిచి తలవాల్చారు. ఇప్పుడు ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తమ అభిమాన నటుడిని అపూరూపంగా చూసుకునే అభిమానులు.. ఈ ఫోటో చూసి ఆవేదన చెందుతున్నారు. తమ నటుడి కష్టం చూసి కళ్లనీరుపెట్టుకుంటున్నారు. జనం కోసం జనసేనానిగా మారిన పవన్ రాజకీయ లక్ష్యం చేరాలని కోరుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: