రాజశేఖర్ కూతురు శివాత్మిక దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమా ద్వారా ఈ అమ్మాయి మంచి అరంగేట్రమే జరిగింది. శివాత్మిక నటకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఆ తర‌వాత సినిమా ఏంటి అన్నది మాత్రం ఇంకా తేలలేదు. ఇప్పుడు ఫిలింనగర్ లో ఓ టాక్ వినిపిస్తోంది. అదేంటంటే.. ప్రకాశ్‌రాజ్‌ కుమార్తెగా దొరసాని కనిపిస్తుందట.

 

తన నటనతో తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న శివాత్మిక ఇప్పుడు కృష్ణవంశీ సినిమాలో నటించబోతోందట. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఇటీవలే రంగ మార్తాండ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు. ఈ సినిమాలో వీరి కూతురుగా శివాత్మికను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. సాధారణంగా రీమేక్ లు అంటే పెద్దగా ఇష్టపడని కృష్ణవంశీ.. మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్‌’ను నచ్చి తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

 

ఇటీవల పెద్దగా హిట్ లు లేని కృష్ణవంశీ.. సినిమా గురించి కసిగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి కీలక సినిమాలో శివాత్మకకు చోటు దక్కడం ఆమె కేరీర్ కు బాగా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. మొదటి సినిమా దొరసానితోనూ.. శివాత్మిక నటిగా నిరూపించుకుంది. ధనవంతుల కుటుంబంలో పుట్టిన పాత్రలో దొరసానిగా కనిపించి మెప్పించింది.

 

దొరసాని తర్వాత శివాత్మిక నటించే సినిమా ఏదన్న విషయంలో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్న ఈ టాక్ నిజమైతే.. శివాత్మిక కేరీర్ లో ఓ మంచి సినిమా పడినట్టే.. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రతి నటుడు కృష్ణవంశీ వంటి దర్శకుడి డైరక్షన్ లో నటించాలని కోరుకుంటారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: