దేశం మొత్తం కుదిపివేసిన  దిశహత్య కేసు నిందితులు ఈ నెల 6న ఎన్‌కౌంటర్ జరిపారు ఆ  ఎన్‌కౌంటర్లో  నిందితులు   చనిపోయిన సంగతి తెలిసిందే.  ఇది బూటపు  ఎన్‌కౌంటర్ అంటూ    ఈ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఎన్‌కౌంటర్‌పై విచారణకు ముగ్గురు రిటైర్డ్ జడ్జిలతో కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అలాగే డెడ్‌బాడీలను భద్రపరచాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

 

ఇంకా దిశ హత్యకేసు నిందితుల మృతదేహాల అప్పగింతపై సస్పెన్స్ కొనసాగుతోంది. నలుగురి డెడ్‌బాడీలు గాంధీ ఆస్పత్రి మార్చురీలోనే ఉన్నాయి. రోజులు గడిచే కొద్ది డెడ్‌బాడీలు  కుళ్లిపోయే స్థితికి వస్తున్నాయి. వాస్తవానికి మృతదేహాలను ఈనెల 13 వరకే భద్రపరచాలని చెప్పారు.. ఈ గడువు ముగిసినప్పటికీ   డెడ్‌బాడీ వారికుటుంబానికి అప్పగించే విషయం లో ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. దీంతో గాంధీ ఆస్పత్రి వైద్యులు, అధికారులు ఇబ్బంది పడుతున్నారు.

 


ఈ నాలుగు మృతదేహాలను ఎంబామింగ్ చేస్తే రెండు వారాల పాటూ భద్రపరచవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే  రీ పోస్ట్‌మార్టమ్‌కు చేసే అవకాశం కోల్పోతామంటున్నారు వైద్యులు . ఎంత కూలింగ్‌లో ఉంచినా.. ఉష్ణోగ్రతలు మెయింటైన్ చేసినా వారం మాత్రమే ఉంటాయని.. తర్వాత డెడ్‌బాడీలు కుళ్లిపోయే స్థితికి వచ్చేస్తాయి అంటున్నారు ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇంకా  విచారణ జరుగుతుండటంతో వైద్యులు కూడా ఏమీ చేయలేని స్థితి లో ఉన్నారు .

 

 కేసు ఎప్పుడు తెగి కోర్ట్  తీర్పు ఎప్పుడు వస్తుందో కూడా క్లారిటీ లేదు.. దీంతో గాంధీ ఆస్పత్రి వైద్యులు, అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థంకాని  అయోమయ పరిస్థితి. అందుకే మృతదేహాలను ఢిల్లీకి తరలిస్తే మంచిదనే అభిప్రాయాన్ని వైద్యులు  వ్యక్తం చేస్తున్నారట. అక్కడైతే అధునాతన సౌకర్యాలతో ఉన్న మార్చురీలు ఉన్నాయంటున్నారు.  దానితో డెడ్ బాడీ లను ఇంకా కొన్ని రోజులు భద్రపరచి వచ్చు అని అబిప్రాయపడుతాయన్నారు .ఇదే విషయాన్ని ప్రభుత్వానికి చెప్పాలనే  ఆలోచనలో ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: