ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని సమావేశాల్లో  6వ  రోజు  మద్యపాన నిషేధంఫై తానూ మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ తనపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని  ఫిర్యాదు చేశారు. తాను చేసిన వ్యాఖ్యలపై ఇష్టం వచ్చినట్లుగా సోషల్ మీడియాలో విషపు రాతలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  

 

దానికి సంబందించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయన్నారు. ఈ వాక్యాలు ఫై తన కుటుంబ సభ్యులు ఫోన్ చేసి అడిగారు అని .. అసెంబ్లీలో తాను తప్పు ఏంమాట్లాడలేదు అన్నారని  భవాని అన్నారు. అలాగే సోషల్ మీడియాలో నీచాతి నీచంగా పోస్టులు పెడుతున్నారని.. దీని గురించి తనకు బాధగా లేదని.. నేను  రాజకీయాల్లోకి పదవుల కోసం రాలేదు . చిన్నతనంలోనే తన తండ్రి, ఇటు తన మామగారు ఎన్నో పదవుల్లో ఉన్నారని.. పదవులు  మాకేమి కొత్త  కాదన్నారు. పార్టీకి, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన తోనే  రాజకీయాల్లోకివచ్చాను అన్నారు 

 

తన తండ్రి ఎర్రంనాయుడు ఆశయాల కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నారు భవాని. తన కుటుంబానికి ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కిందని.. తాను కూడా పదిమందికి సేవ చేయగలిగితే చాలు అనుకున్నానని వ్యాఖ్యానించారు. తన కుటుంబ సభ్యులంతా నన్ను ప్రోత్సహించి రాజకీయాల్లోకి తీసుకొచ్చారని.. అంటూ ఒక సమయం లో   భావోద్వేగానికి గురయ్యారు.

 

సోషల్ మీడియాలో తనపై రక, రకాల పోస్టులు పెట్టారని భవాని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధారాలతో సహా తన దగ్గర ఉన్నాయని.. మూడు రోజుల క్రితం సీఎం మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడితే ఊరుకొనేది  లేదన్న వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. ఓ ఎమ్మెల్యేగా తన పరిస్థితే ఇలా ఉంటే.. సాధారణ మహిళల పరిస్థితి ఎలా ఉంటుంది అని వారి గతి ఏంటి  ప్రశ్నించారు.ఈ పోస్టుల వెనుక ఎవరెవరు ఉన్నారో.. పరిశీలించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ పోస్టుల వెనుక ఎవరెవరు ఉన్నారో.. పరిశీలించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.కొత్తగాప్రభుత్వం  తీసుకొచ్చిన ఈ దిశ చట్టాన్నితన నుంచి అసెంబ్లీలో ప్రారంభించాలన్నారు టీడీపీ ఎమ్మెల్యే సమాజానికి  అప్పుడే ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందన్నారు భవాని.

 

మరింత సమాచారం తెలుసుకోండి: