+ తెలంగాణలో అధికార పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో గట్టి దెబ్బతగిలింది.
+ అధికార పార్టీ అధినేత కేసీఆర్ దూకుడు పెంచారు. అయితే,ఆయనకు తీవ్ర మైన ఎదురు గాలులు కూడా ఈ ఏడాది ఎక్కువయ్యాయి.
+ ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్యంగా తెలంగాణ లో బీజేపీకి నాలుగు స్థానాల్లో విజయం దక్కింది.
+ తెలంగాణ నుంచి తొలిసారి కేంద్రంలో సహాయ హోంశామ మంత్రిగా కిషన్ రెడ్డికి అవకాశం లభించింది.
+ తెలంగాణలో అంతో ఇంతో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నుంచి ఒకే సారి 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయి, కేసీఆర్కు జై కొట్టిన చరిత్ర కూడా ఈ ఏడాదే జరిగింది.
+ ఖమ్మంలో టీడీపీకి అండగా ఉన్న నామా నాగేశ్వరరావు ఈ ఏడాదిలో జరిగిన పార్లమెంటు ఎన్నికలకు ముంద ఆయన అనూహ్యంగా సైకిల్ దిగి కారెక్కేశారు. అదేసమయంలో ఖమ్మం ఎంపీ టికెట్ సంపాయించుకుని విజయం సాధించారు.
+ హుజూర్ నగర్కు జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్టీసీ కార్మిక సమ్మెలో రగిలిన వ్యతిరేకతను సైతం అధికార పార్టీ జయించి ఘన విజయం సాధించింది.
+ హుజూర్నగర్లో ఉప ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ నాలుగోస్థానానికి కూడా దక్కించుకోలేక పోయింది.
+ తెలంగాణ మహిళా గవర్నర్గా తమిళనాడుకు చెందిన తమిళిసై నియమితులయ్యారు.
+ ఆర్టీసీ కార్మికుల సమ్మె 51 రోజులు సాగి రాష్ట్రాన్ని కుదిపేసింది.
+ కార్మికుల సమ్మెను ఎంతో తీవ్రంగా అణిచేసిన సీఎం కేసీఆర్.. అంత ఉదాత్తంగా వారిపై వరాలు కురిపించారు.
+ ఈ ఏడాది జరిగిన మరో కీలక ఘట్టం.. ఏపీ-తెలంగాణ సీఎంల మధ్య స్నేహ గీతిక
+ ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లు ఇరువురూ పరస్పరం ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు.
+ఏదేమైనా ఓవరాల్గా లోక్సభ ఎన్నికల్లో కారు జోరుకు కాస్త బ్రేక్ పడినా చివర్లో జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఏకంగా 40 వేల ఓట్ల భారీ మెజార్టీ రావడంతో తెలంగాణలో ఇప్పట్లో కారు జోరుకు బ్రేకులు పడే పరిస్థితులు లేవు.