తన ప్రభుత్వ పాలనావైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే, ముఖ్యమంత్రి జగన్‌,  అసెంబ్లీసాక్షిగా కొత్తభాష్యాలు చెప్పారని, తనమంత్రివర్గానికి కూడా సమాచారంలేకుం డా, అమరావతిపై ఇష్టానుసారం ప్రకటనచేశాడని టీడీపీ సీనియర్‌నేత, ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు చెప్పారు. తనప్రభుత్వం రాజధానిపై నియమి ంచిన జీఎన్‌.రావు కమిటీనివేదిక రాకమునుపే ముఖ్యమంత్రి ఊహాగానాలు చేయడం రాజ్యాంగానికే విరుద్దమన్నారు. కులాలు, మతాలమధ్య విద్వేషాలు రెచ్చగొట్టే లక్ష్యంతో, 6నెలల కాలంలో అవినీతే ధ్యేయంగా జగన్‌ పాలనసాగించాడని కళా తెలిపారు. 


తనవ్యాఖ్యలతో రాష్ట్రంలో తుగ్లక్‌పాలన నడుస్తోందని సీఎం రుజువు చేశాడని, ఆయన వచ్చినప్పటినుంచీ కూల్చివేతలు, రద్దులు, రివర్స్‌లే సరిపోయాయన్నారు. సన్నబియ్యం ఇస్తామని చెప్పి, రేషన్‌బియ్యానికి పాలిష్‌పట్టి పంపిణీచేసే దుస్థితికి రాష్ట్రప్రభుత్వం దిగజారిందని వెంకట్రావు మండిపడ్డారు. పింఛన్లు,  చంద్రన్నబీమా, చంద్రన్న పెళ్లి కానుక, క్రిస్మస్‌,సంక్రాంతి కానుకలు, రంజాన్‌తోఫాలు, అన్నాక్యాంటీన్లమూత, పోలవరం పనుల నిలిపివేతే కొనసాగిందన్నారు. రివర్స్‌టెండర్ల పేరుతో డబ్బులు మింగడంతప్ప,  ప్రజలగురించి ప్రభుత్వానికి పట్టడంలేదన్నారు.

 

రాష్ట్రంలో రైతులపరిస్థితి మరీదారుణంగా తయారైందని, ఇప్పటివరకు పండినపంటలు కొనుగోలుచేయకపోవడం ఇప్పుడే చూస్తున్నామన్నారు. 
గిట్టుబాటుధర విషయంలో ప్రభుత్వం ప్రకటనలకే సరిపోయిందని, ఊరికో ఫ్లెక్సీ ఏర్పాటుచేసింది తప్ప ఎక్కడా ఒక్కబస్తా ధాన్యం కూడా కొనలేదన్నారు.  సబ్సిడీపై రైతులకు అందించే వ్యవసాయపరికరాల పంపిణీ నిలిపివేసిన ప్రభుత్వం,  నీటిపారుదలరంగ ప్రాజెక్టులు కూడా నిలిపివేసిందన్నారు. పేదలఉపాధి కోసం  పెట్టిన   ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకాన్ని నిలిపివేసిన వైసీపీసర్కారు, చేసినపనులకు సంబంధించిన నిధులను కూడా ఇవ్వకుండా కూలీలు, కాంట్రాక్టర్లను వేధిస్తోందన్నారు. టీడీపీ పాలన లో రూ.1200లకు లభించిన ట్రక్కుఇసుక, ఇప్పుడు రూ.4నుంచి 5వేలకు చేరిందని, ఇసుకకొరత సృష్టించి 50మంది చావులకు ఈ ప్రభుత్వం కారణమైందన్నారు. వైసీపీ  మాఫియా అంతా ఇసుకను దోచేస్తూ, ఎక్కువధరలకు అమ్మడంకోసమే 6నెలల్లో భవననిర్మాణ కార్మికుల చావులకు పాల్పడిందని కళా ఆగ్రహంవ్యక్తంచేశారు. 


విద్యుత్‌  రంగంలో పీపీఏలరద్దుతో, ప్రభుత్వం ఏం సాధించిందన్నారు. కేంద్రం కర్రుకాల్చి వాత పెట్టినా మారకుండా చివరకు రాష్ట్రాన్ని చీకట్లపాలు చేశారన్నారు. ఆర్టీసీఛార్జీలు పెంచి, సామాన్యుడిపై రూ.700కోట్ల వరకు భారం మోపడం ద్వారా పరిపాలనలో విఫలమయ్యారని సుస్పష్టంగా అర్థమవు తోందన్నారు. తన వైఫల్యాన్ని పక్కదారి పట్టించడానికే, అసెంబ్లీలో ఆదరాబాదరాగా జగన్‌ 3 రాజధానుల ప్రకటనచేశాడని వెంకట్రావు తేల్చిచెప్పారు. ప్రతిపక్షనేతగా ఆనాడు రాజధానిని సమర్థించిన జగన్‌, నేడు ముఖ్యమంత్రిగా రాష్ట్రప్రజల్ని గందరగోళా నికి గురిచేసేలా ప్రకటనలివ్వడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. ప్రాంతీయ విబేధాలతో, కులమతాలతో చిచ్చుపెట్టడంద్వారా జగన్‌ రాష్ట్రాన్ని ఏంచేయనున్నాడనే ఆందోళన కలుగుతోందన్నారు. విశాఖలో ఏర్పాటుకావాల్సిన లులూ, ఆదానీగ్రూప్‌ సంస్థలు వెనక్కువెళ్లడానికి జగన్‌ వైఖరికారణంకాదా అని టీడీపీనేత ప్రశ్నించారు.       

మరింత సమాచారం తెలుసుకోండి: