2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వరుస షాకులు ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన రాపాక ఈరోజు జగన్ కు పాలాభిషేకం చేసి వార్తల్లో నిలిచారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా జనసేన అధినేత రాపాక వరప్రసాద్ జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.
 
రాజోలు నియోజకవర్గంలో జరిగిన జగన్ పుట్టినరోజు వేడుకల్లో రాపాక వరప్రసాద్ పాల్గొన్నారు. జగన్ పుట్టిన రోజు వేడుకల్లో పాలాభిషేకం చేయటంతో పాటు రాపాక కేక్ కూడా కట్ చేశారు. రాపాక చేనేత సొసైటీ దగ్గర నిర్వహించిన వేడుకల్లో కూడా పాల్గొన్నారు. రాపాక రోజురోజుకు వైసీపీ పార్టీకి దగ్గరవుతున్నాడని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. 
 
కొన్నిరోజుల క్రితం రాపాక పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రమం చేసినా పది మంది మాత్రమే వస్తారని రాపాక అన్నారు. ప్రతి చిన్న విషయానికి ధర్నాలు, సభలు చేయటం మంచిది కాదని చెప్పారు. పవన్ కళ్యాణ్ సభలకు రానురాను ఆదరణ తగ్గిపోతుందని అన్నారు. మరోవైపు రాపాక సీఎం జగన్ పై మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. 
 
గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జగన్ కోరని కోరికలు తీర్చే దేవుడని రాపాక ప్రశంసించారు. ఈ నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో  జగన్ ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియంను కూడా రాపాక స్వాగతించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరికి, జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైఖరికి పొంతన లేకపోవడంతో రాపాక పార్టీ మారడానికి ఎన్నో రోజులు పట్టదని తెలుస్తోంది. జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే కూడా పార్టీకి దూరమైతే అది పవన్ కు షాక్ అనే చెప్పవచ్చు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: