ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, తమ రాష్ట్రంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ ఆర్ సి) అమలుకు ఎప్పటికి మద్దతు ఇవ్వదని పేర్కొన్నారు. కడపాలో సోమవారం జరిగిన సమావేశంలో ప్రసంగించిన జగన్ మోహన్ రెడ్డి, తన క్యాబినెట్ సహోద్యోగి, ఉప ముఖ్యమంత్రి అమ్జత్ బాషా షేక్ బేపారి, మైనారిటీ నాయకుడు, ఎన్ఆర్సిని బహిరంగంగా వ్యతిరేకించే ముందు తనను సంప్రదించినట్లు చెప్పారు. ప్రభుత్వం ఎన్ఆర్సి అమలు ను వ్యతిరేకిస్తుంది. ఈ నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి వుంది అని అయన పేర్కొన్నారు.
నా మైనారిటీ సోదరులు ఎన్ఆర్సి పై ఒక ప్రకటన చేయమని నన్ను అడిగారు. మేము ఎన్ఆర్సిని వ్యతిరేకిస్తామని స్పష్టం చేయాలనుకుంటున్నాను, ఆంధ్రప్రదేశ్ దీనికి మద్దతు ఇచ్చే మార్గం లేదు అని సిఎం వై యస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎన్ ఆర్ సి కి లేదా ముస్లింల ప్రయోజనాలకు విరుద్ధమైన ఏ బిల్లుకు ప్రభుత్వం మద్దతు ఇవ్వదని కొన్ని రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి అమ్జత్ బాషా షేక్ బేపారి, మైనారిటీ నాయకుడు చెప్పినట్లు గుర్తు చేసుకోవచ్చు. మైనారిటీ వర్గాల ప్రయోజనాల కోసం పార్టీ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
జగన్ మోహన్ రెడ్డి యొక్క వైయస్ఆర్ కాంగ్రెస్, పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు లోక్ సభ , రాజ్య సభ ల లో మద్దతు ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు పౌరసత్వ సవరణ బిల్లుకు (క్యాబ్) లోక్సభ, రాజ్యసభ రెండింటిలోనూ మద్దతు ఇచ్చారు. తదనంతరం, హైదరాబాద్లోని ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇట్టేహాద్-ఉల్-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం ) నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ, ఎన్ఆర్సికి మద్దతు ఇవ్వడం పై తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని జగన్ను అభ్యర్థించారు. తర్వాత పరిణామాలను పరిశీలించి వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు తమ ప్రభుత్వం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ ఆర్ సి ) అమలుకు వ్యతిరేకమని ప్రకటించారు.