ఈ మధ్య కాలంలో మనుషులు మానవ సంబంధాలను మరిచిపోయి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. వావీవరసలు మరిచి అమ్మాయి కనిపిస్తే చాలు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. ఒక యువకుడు వావీవరసలను మరిచి చెల్లినే ప్రేమించి తనను ప్రేమించకపోతే కిడ్నాప్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. గత కొన్ని రోజుల నుండి వేధింపులు ఎక్కువ కావడంతో యువతి తల్లి బలవన్మరణానికి పాల్పడింది. యువతి తల్లి బలవన్మరణానికి పాల్పడటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
పూర్తి వివరాలలోకి వెళితే తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగలో గుగులోత్ సునీత అనే యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి నివశిస్తూ ఉండేది. అనిల్ అనే వ్యక్తి సునీతను మొదట తనకు వరుసకు బావను అవుతానని చెప్పి మాయమాటలు చెప్పాడు. సునీత మాత్రం వరుసకు అన్నాచెల్లెళ్లం అవుతామని ప్రేమించడం కుదరదని తేల్చి చెప్పింది. విషయం పెద్దది కావడంతో పంచాయతీ కుల పెద్దల వరకు వెళ్లింది. 
 
కులపెద్దలు ఇద్దరి కుటుంబాలను పిలిచి విచారణ జరిపారు. విచారణ తరువాత అనిల్, సునీత ఇద్దరూ వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారని తేల్చి చెప్పారు. వావీవరసలు మరచి ప్రవర్తించవద్దని బుద్ధి మార్చుకోవాలని గ్రామ పెద్దలు అనిల్ ను మందలించారు. గ్రామ పెద్దలు చెప్పిన తరువాత అనిల్ తన బుద్ధిని మార్చుకోలేదు. సునీత తల్లిదండ్రులతో సునీతను తనకు ఇచ్చి పెళ్లి చేయాలని పెళ్లి చేయకపోతే కిడ్నాప్ చేసి మరీ పెళ్లి చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. 
 
వరుసకు అన్న అయిన వ్యక్తి తన కూతురును పెళ్లి చేసుకుంటే తమ పరువు పోతుందని సునీత తల్లి పద్మ భావించింది. పురుగుల మంది తాగి పద్మ బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులకు ఈ ఘటన గురించి సమాచారం అందడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పద్మ మృతికి కారణమైన అనిల్ ను కఠినంగా శిక్షించాలని పద్మ బంధువులు, స్థానికులు డిమాండ్ చేసున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: