గతంలో ఎవరైనా సుసైడ్ చేసుకోవాలనుకుంటే.. తాము ఎందుకు చనిపోతున్నారో చెప్పాలనుకుంటే.. ఓ సుసైడ్ లెటర్ రాసి పెట్టేవారు. అందులో కారణాలు వివరించే వారు.. అంతే కాదు.. తమ కుటుంబ సభ్యులకు ఇంకా ఏమైనా చెప్పాలనుకున్నవి ఉంటే.. అంతా వివరంగా రాసేవాళ్లు.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అన్నింటికీ ఇప్పుడు ఒక్కటే రూట్.. అదే స్మార్ట్ ఫోన్.

 

అందుకే ఇప్పుడు సుసైడ్ చేసుకునేవాళ్లు సెల్ఫీ వీడియో తీసుకుంటున్నారు. ఎవరెవరికి పంపాలో వారికి పంపుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో ఓ యువకుడు ఏకంగా తన మరణ వాగ్మూలం వీడియోను తమ ఎమ్మెల్యేకు పంపించాడట. తాను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నది ఎమ్మెల్యేకు సెల్ఫీ వీడియో ద్వారా వివరించాడట. ఇంతకూ ఆ యువకుడు ఆ ప్రయత్నం ఎందుకు చేశాడో తెలుసా.. రేషన్ డీలర్ ఇప్పిస్తానని చెప్పిన ఓ దళారీ ఇప్పించలేదట.

 

దాంతో మనస్థాపంతో పురుగులమందు తాగాడు. ఎమ్మెల్యే రజినీ అక్కా.. ఊళ్లో తలెత్తుకు తిరగలేకపోతున్నా.. నా పిల్లలను చూసుకోవాలంటూ వైసీపీ ఎమ్మెల్యేని కోరుతూ వీడియో తీశాడు. ఇప్పుడు అది వైరల్ అవుతోంది. నాయకులను నమ్మి మోసపోయి ఆత్మహత్య చేసుకుంటున్నానని.. ఎమ్మెల్యే అక్కా.. నా పిల్లలను చూసుకో.. అంటూ అతను తీసుకున్న వీడియో వెలుగు చూసింది.

 

ఆ యువకుడి పేరు మస్తాన్.. ఊరు చిలకలూరిపేట నియోజకవర్గంలోని అప్పాపురం. రేషన్ డీలర్ పోస్టు ఇప్పిస్తామని చెప్పి సాంబయ్య అనే వ్యక్తి మోసం చేశాడని.. ఊళ్తో తలెత్తుకు తిరగలేకపోతున్నానని అతడు వీడియోలో వాపోయాడు. పిల్లల కోసం బతకాలని ఉన్నా.. ఊళ్లో తిరగలేక చనిపోతున్నానని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.

 

ఇంకా ఎమ్మెల్యేకు ఏమని విజ్ఞప్తి చేశాడంటే.. “ ఎమ్మెల్యే రజినీ అక్కా.. మీ వెంటే తిరిగాను.. నా పిల్లలను చూసుకో అక్కా.. మీ పిల్లల్లానే చూసుకోవాలి. అయితే పురుగుల మందు తాగిన మస్తాన్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మస్తాన్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: