50 టీఎంసీలు కాళేశ్వరం ద్వారా ఎస్సారెస్పీ తో సంబంధం లేకుండా  లోయర్, మిడ్ మానేరులో నింపుకున్నాం.  బ్యారేజీల్లో మరో 60 టీఎంసీలు నింపే అవకాశం ఉంది. ఇకపై వర్షాల కోసం రైతు మొగులు వైపు చూడనవసరం లేదు.  గోదావరి తీర తెలంగాణలో కరవు ఉండకూడదని 2001లోనే ఆకాంక్షించాం. కాళేశ్వరంతో ఆ కల  నెరవేరింది. మిడ్ మానేరు చూస్తే చాలా ఆనందం వేసింది. అనేక వాగులున్న కరీంనగర్ జిల్లా గోదావరి నదితో పాటు  ఇంతకాలం కరువుతో అల్లాడింది. అనేక మంది ఈ జిల్లాల నుంచి వలసలు పోయారు. సిరిసిల్లలో ఆకలి చావులుండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ జిల్లా ఎలా మారిందో చూస్తున్నారు. 140 కి.మీ జిల్లాలో  గోదావరి 365 రోజులు ఇకపై సజీవంగా ఉంటుంది. భూగర్భ జలాలు పెరిగి బోర్లు బయటకు పోస్తున్నాయి.

 

 200 కి.మీ కాకతీయ కెనాల్ పారుతుంది. 200 కిలోమీటర్లు  మెట్‌పల్లి దమ్మన్నపేట నుంచి హసన్ పర్తి  వరకు రెండు పంటలు పండిస్తున్నారు. ఎస్సారెస్పీ ఎల్లప్పుడు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం కింద  నిండుగా ఉంటుంది.  జిల్లాకు మానేరు నది మరో వరం. ఇది 181 కి.మీ. మేర పారుతుంది.  గతంలో ఎవరూ ఈ నదిని  పట్టించుకోలేదు. ఈ రాష్ట్ర అభివృద్ధి పై ఏ పార్టీకి లేనంత కమిట్ మెంట్ ఉంది.  ఎక్స్‌రే తో రాష్ట్రాన్ని టీఆర్ఎస్ చూస్తుంది.రూ. 1250 కోట్లతో  1230 చెక్ డ్యాంలు రాష్ట్రంలో నిర్మించ బోతున్నాం. వీటిలో సింహ భాగం  పాత కరీంనగర్ జిల్లాలో చెక్ డ్యాంలు నిర్మించబోతున్నాం. మానేరుపై 29, మూలవాగుపై 10 చెక్ డ్యాంలకు వెంటనే టెండర్లు పిలుస్తాం. పాలుగారే జిల్లాగా కరీంనగర్ మారబోతోంది. మిడ్ మానేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా గొప్ప పాత్ర పోషించబోతోంది.


 కీలక ప్రాజెక్టులుగా ఎల్లంపల్లి, మిడ్ మానేరు, మల్లన్న సాగర్ ఉంటాయి. 75-80 లక్షల ఎకరాల్లో  కాళేశ్వరం ప్రాజెక్టు కింద రెండు పంటలు పండుతాయి. రైతులు బోర్లు మోటార్లు  40 వేల కోట్లతో పెట్టుకున్నారు.రాష్ట్రంలో   26, 27 లక్షల పంపుసెట్లు ఉన్నాయి. జూన్ లోగా జిల్లాలోని చెక్ డ్యాంలు పూర్తి చేస్తాం. లండన్‌లోని థేమ్స్ నదిలాగా మానేరు సజీవంగా ఉంటుందని నేను గతంలో చెబితే కొందరు సన్నాసులు వెకిలిగా నవ్వారు. వచ్చే జూన్ నాటికి ఈ ప్రాంతం ఎలా మారుతుందోమారుతుంది చూపిస్తాం. నేను కలలు గన్న తెలంగాణ  కనిపిస్తోంది. 46 వాగులు ఉమ్మడి కరీంనగర్  జిల్లాలో ప్రవహిస్తున్నాయి. కొంతమందికి ఇన్ని వాగులున్నాటని కూడా తెలియదు.


రాష్ట్రం  మొత్తంలో  మాకు ఎవరూ దరఖాస్తు చేయకున్నా కానీ రాష్ట్రము బాగుపడాలన్న లక్ష్యంతో స్కీంలు తెచ్చాం. కాంగ్రెస్, బీజేపీలకు భౌగోళిక, సాంకేతిక, విషయ పరిజ్ఞానం లేదు. మిడ్ మానేరు ను నింపే క్రమంలో కూడా కొందరు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడారు. మిడ్ మానేరులో సీపేజీల గురించి అవగాహన లేకుండా మాట్లాడారు. 15 టీఎంసీలు నింపినప్పుడు కొంచెం ఎక్కువ సీపేజీ వస్తే టెస్టులు చేయించాం. ఆ సీపేజీ వచ్చిన ప్రాంతంలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే  కాంట్రాక్టు పనులు గతంలో చేసాడు. కాళేశ్వరంపై ఎన్ని కేసులు వేసినా పట్టించుకోకుండా పనిచేశాం.

మరింత సమాచారం తెలుసుకోండి: