రాష్ట్ర ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు, ఆశయాలకు అనుగుణంగా ఒక టీం వర్క్ లాగా పని చేసి ప్రభుత్వ లక్ష్య సాధనకు కృషి చేస్తానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆయనడా.ఎస్.కె.జోషి నుండి పదవీ  బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం  సోమేశ్ కుమార్  మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంకేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను నిర్ధిష్ట కాలవ్యవధిలో పూర్తి చేసేలా కృషి చేస్తానన్నారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయంతో పని చేస్తానని అన్నారు. విధి నిర్వహణలో వినూత్న పద్దతులను అవలంబిస్తూ , రాష్ట్ర అభివృద్దికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

గణనీయమైన పురోగతి

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక వివిధ రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించిందని అన్నారు. ప్రభుత్వ లక్ష్య సాధనకు మీ అందరి సహకారం అందించాలని కోరారు. పేద ప్రజలకు, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా ఉద్యోగులు పని చేయాలన్నారు. పదవీ విరమణ పొందిన డా.ఎస్.కె.జోషి తగు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. వారు పాటించిన పద్దతులను అనుసరిస్తామని అన్నారు. జి.హెచ్.యం.సి కమీషనర్ గా , రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా పని చేసిన సమయంలో జోషి ఎంతో సహకారమందించారన్నారు. వారి సేవలను గుర్తించి ప్రభుత్వం నీటిపారుదల శాఖ సలహాదారులుగా నియమించిందని, వారి సలహాలు ఎల్లప్పుడు అందించాలని కోరారు.

ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు..

పదవీ విరమణ పొందుతున్నసి.యస్ డా.ఎస్.కె.జోషి మాట్లాడుతూ, అధికారిక విధుల నిర్వహణలో సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అధికారులందరు ఎంతో ఉత్సాహంతో పనిచేశారని అదే ఉత్సాహంతో పనిచేయాలన్నారు. జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా సమావేశానికి వచ్చిన అధికారులకు స్వాగతం పలికారు, అనంతరం జోషి అందించిన సేవలను కొనియాడారు. సి.యస్ గా బాధ్యతలు స్వీకరించిన సోమేశ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: