రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ సహా.. కీలకమైన ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికల్ని అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన హైపవర్ కమిటీ ఈ నెల6న తొలిసారిగా భేటీ కానుంది. ఆ రోజు మధ్యాహ్నం సచివాలయంలో సమావేశం కానుంది. రాజధానిపై జీఎన్‌ రావు కమిటీ ఇప్పటికే నివేదిక సమర్పించింది. మరో వైపు బీసీజీ తన నివేదికను శుక్రవారం సీఎంకు అందజేస్తుంది. ఈ రెండు కమిటీల నివేదికలను హైపవర్ కమిటీ అధ్యయనం చేసి... మూడు వారాల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. 


నిర్ణేతలు వీళ్ళే.. 


రాజధాని అంశంపై రాష్ట్రంలో ఉత్కంఠత నెలకొన్న నేపథ్యంలో ఈ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కమిటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్‌, బొత్స సత్యనారాయణ, గౌతమ్​రెడ్డి, కన్నబాబు, సుచరిత, మోపిదేవి, కొడాలి నాని, పేర్ని నాని, సీఎం జగన్ ముఖ్య సలహాదారు, డీజీపీ, సీసీఎల్‌ఏ, పురపాలక శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. హైపవర్‌ కమిటీ కన్వీనర్‌గా సీఎస్‌ నీలం సాహ్ని వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు, డీజీపీ, సీసీఎల్‌ఏ, పురపాలక శాఖ కార్యదర్శులు ఉన్నారు. హైపవర్‌ కమిటీ సభ్య కన్వీనర్‌గా సీఎస్‌ నీలం సాహ్ని వ్యవహరించనున్నారు. అయితే అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగానే మూడు రాజధానుల ఏర్పాటు చేసి విశాఖలో ఎగ్జిక్యూటీవ్ కేపిటల్ తరలింపు అంశాన్ని హైపవర్ కమిటీ సిఫార్సు చేసే ఛాన్స్ ఉన్నట్టు చెబుతున్నారు.


నివేదికకు ఉత్తర్వులు.. 


మూడువారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే హై పవర్ కమిటీ ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోలో రాజధాని అనే పదాన్నే  సర్కార్ ఎక్కడా ప్రస్తావించ లేదు. అభివృద్ధి వికేంద్రీకరణ మీద రెండు నివేదికలను హైపవర్ కమిటీ అధ్యయనం చేస్తుందని జీవోలో స్పష్టం చేశారు. అయితే రాజధాని తరలింపు విషయంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా సర్కార్ ముందు జాగ్రత్త చర్యగా ఈ పనులు చేస్తుందని అధికార వర్గాల వారు చెబుతున్నారు. కాగా అభివృద్ధి వికేంద్రీకరణ చేయాల్సిందేనని కానీ రాజధానులు మార్చకూడదని అన్ని పక్షాలు చెబుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: