వారంతా స్కూలు విద్యార్థులు.. విహార యాత్ర కోసం పక్క రాష్ట్రం కర్ణాటక వెళ్లారు. అక్కడ అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురుయ్యారు. ఒక విద్యార్థి మృతి చెందాడు కూడా.. చాలా మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ విషయం తెలిసుకున్న వైఎస్ జగన్..

కర్ణాటకలోని ఉడిపి వద్ద అనంతపురం జిల్లా కదిరి స్కూల్‌బస్సుకు జరిగిన ప్రమాదంపై ఆరా తీశారు. ప్రమాద వివరాలను సీఎంవో అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే సహాయ కార్యక్రమాలు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

 

గాయపడ్డ వారికి చికిత్స అందించేలా చూడాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులు తిరిగి క్షేమంగా రావడానికి తగిన ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జగన్ సూచనలు చేశారు. బస్సు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందగా, మరో అయిదుగురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.

 

ఈ ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక శివమొగ్గ జోగ్‌ఫాల్స్‌ అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. చిన్నారుల వెంట వెళ్లిన టీచర్‌, వంట మనిషి కూడా గాయపడినట్లు తెలుస్తోంది. డ్రైవర్‌ మద్యం సేవించి నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పాఠశాల హెచ్‌ఎం రాజేంద్రన్‌ తెలిపారు. ఈ నెల 2వ తేదీన కదిరి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులతో కలిసి 45మంది విద్యార్థులు విహారయాత్రకు వెళ్లారు.

 

శుక్రవారం రోజంతా జోగ్‌ జలపాతం వద్ద ఆనందంగా గడిపారు. తర్వాత రాత్రిపూట బస చేసేందుకు మురిడి బయలుదేరగా మార్గంమధ్యలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆ దారిగుండా వెళుతున్న ఇతర వాహనాల డ్రైవర్లు సమీపంలోని పోలీసులకు తెలియజేయడంతో వారు అనంతపురం జిల్లా ఎస్పీ సత్యా యేసు బాబుకు సమాచారం ఇచ్చారు. గాయపడినవారు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: