మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సిబిఐ విచారణ ఎదుర్కోనున్నారా? అంటే సిబిఐ వాదనలు పరిశీలిస్తే అవుననే స్పష్టం అవుతోంది . జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన్ని విచారించవచ్చునని దర్యాప్తు సంస్థ, సిబిఐ కోర్టు కు నివేదించింది . వాన్ పిక్ కేసులో అవినీతి నిరోధక చట్టం కింద ఉన్న ఆరోపణలపై ధర్మాన పై సిబిఐ విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధమైంది .
ప్రభుత్వం మారి మంత్రి పదవి లో ధర్మాన ప్రసాదరావు లేకపోవడంతో అవినీతి నిరోధక చట్టం కింద ఉన్న కేసుల నిమిత్తం పరిగణలోకి (కాగ్ని జెన్స్) లోకి తీసుకుంటూ , సిబిఐ కోర్టు గతం లో జారీ చేసిన ఉత్తర్వులని సుప్రీం కోర్టు సమర్ధించిన విషయాన్నీ ఈ సందర్బంగా దర్యాప్తు సంస్థ సిబిఐ, కోర్టు కు తెలిపింది . ఈ విషయం లో హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి , సిబిఐ కోర్టు ఉత్తర్వులను సమర్ధించిందని గుర్తు చేసింది .
అందువల్ల అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టవచ్చునని పేర్కొంది . జగన్ అక్రమాస్తుల కేసులో అన్ని అంశాలను పరిశీలించిన సిబిఐ కోర్టు న్యాయమూర్తి మధుసూదన్ రావు , సిబిఐ దాఖలు చేసిన దరఖాస్తును పరిశీలించి , సుప్రీం కోర్టులో ధర్మాన కేసు వ్యవహారం ఏ స్థాయిలో ఉందో చెప్పాలని ఆదేశించిన విషయం తెల్సిందే. వైఎస్ ప్రభుత్వం హయాం లో వాన్ పిక్ కు అక్రమంగా భూములను కట్టబెట్టారన్న ఆరోపణలున్నాయి .
వాన్ పిక్ భూముల కేటాయింపులో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని విపక్షాలు ఆందోళనలు , నిరసన కార్యక్రమాలు గతం లో చేపట్టాయి . వాన్ పిక్ కు కేటాయించిన భూములని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి . వాన్ పిక్ కు భూ కేటాయింపు వ్యవహారం లో క్విడ్ ప్రోకో జరిగిందని టీడీపీ ఆరోపణలు చేసింది .