కర్ణాటక రాష్ట్రంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రికి తీసుకెళ్లిన మహిళను వైద్యులు చనిపోయిందని చెప్పటంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. దుఃఖాన్ని దిగమిగుకుంటూ అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. మహిళను అంత్యక్రియలకు తరలించే సమయంలో చనిపోయిన మహిళ కళ్లు తెరచి లేచి కూర్చుంది. చనిపోయిన మహిళ లేచి కూర్చోవడంతో ఆమెను చూసిన కుటుంబ సభ్యులు మరియు బంధువులు ఆశ్చర్యపోయారు. 
 
పూర్తి వివరాలలోకి వెళితే కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలోని ముచ్చెండి గ్రామానికి చెందిన యల్లప్ప చవగళ్ అనే 55 సంవత్సరాల వయస్సు గల మహిళ గత కొన్ని రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధ పడుతోంది. మహిళ కుటుంబ సభ్యులు మహిళను సమీపంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అన్ని పరీక్షలు చేసి మహిళ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. 
 
బుధవారం మధ్యాహ్నం మరోసారి పరీక్షలు చేసిన వైద్యులు మహిళ గుండె ఆగి చనిపోయిందని చెప్పారు. మహిళ చనిపోయిందని చెప్పటంతో ఆమె కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు, సన్నిహితులకు సమాచారం ఇచ్చారు. స్మశానానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో మహిళ కళ్లు తెరవటంతో కుటుంబ సభ్యులు, బంధువులు షాక్ అయ్యారు. 
 
అంత్యక్రియలకు తరలించే సమయంలో మహిళ కళ్లు తెరవటంతో వెంటనే మహిళకు పాలు పట్టించి ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇదంతా వైద్యుల నిర్లక్ష్యం వలనే జరిగిందని మహిళ కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. అంత్యక్రియలు జరిగి ఉంటే తమ పరిస్థితి ఏమిటని మహిళ బంధువులు ప్రశ్నిస్తున్నారు. వైద్యుల తీరుపై మహిళ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రతికున్న మహిళను చనిపోయిందని చెప్పిన వైద్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చనిపోయిందనుకున్న మహిళ కళ్లు తెరవటంతో తాము నిర్ఘాంతపోయామని స్థానికులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: