తెలంగాణ రాష్ట్రంలో హన్మకొండల్ రాం నగర్ లో యువతి మెడపై ఉన్మాది అతి కిరాతకంగా దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి తీవ్రంగా గాయాలయ్యాయి. పూర్తి వివరాలలోకి వెళితే గడచిన కొన్ని నెలలుగా షాహిద్ - హారతి సహజీవనం చేస్తున్నారు. ఒకే కాలానీకి చెందిన వీరిద్దరు పెళ్లి చేసుకోకుండా ఒక గదిలో కలిసి నివశిస్తున్నారు. గత కొన్ని రోజులుగా షాహిద్ హారతిపై అనుమానం పెంచుకున్నాడు. 
 
హారతి వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుందని గత కొన్ని రోజులుగా షాహిద్ హారతిని వేధిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు హారతి షాహిద్ మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఉద్దేశపూర్వకంగా షాహిద్ హారతిని చంపాలని నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. హారతిని చంపాలని ప్రణాళిక రచించిన షాహిద్ బ్లేడు తీసుకొని అమ్మాయి గొంతు కోశాడు. ఆ తరువాత రక్తపు మడుగులో పడి ఉన్న హారతిని అక్కడే వదిలేసి జిల్లా జడ్జి ఎదుట లొంగిపోయాడు. 
 
ఈ ఘటన ఈరోజు మధ్యాహ్నం జరిగింది. షాహిద్ తలుపులు మూసి వెళ్లటంతో కొంత ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గది నుండి రక్తం బయటకు రావడంతో స్థానికులు గమనించి హారతిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం షాహిద్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. యువతి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని తెలుస్తోంది. 24 గంటలు గడిస్తే తప్ప ఏం చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. 
 
గత కొంతకాలంగా వరంగల్ లో హత్య, హత్యాయత్నంకు సంబంధించిన ఘటనలు పెరిగిపోతున్నాయి. కొన్ని రోజుల క్రితం మానస అనే యువతిని పుట్టినరోజు నాడు అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. మానస ఘటన జరిగిన ప్రాంతానికి కొంత దూరంలో ఉన్న రాం నగర్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. పోలీసులు క్లూస్ టీంతో వెళ్లి సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: