అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తోన్న ఆందోళనలకు సినీ హీరో , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంఘీభావం ప్రకటించనున్నారు . ఈ మేరకు ఆయన  గురువారం రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు .బాలయ్య తో పాటు ఆయన సతీమణి వసుంధర , అల్లుడు లోకేష్ , కూతురు బ్రాహ్మణి లు రాజధాని గ్రామాల్లో పర్యటించి ప్రజలను కలుసుకోనున్నారు . రాజధాని పరిధిలోని తుళ్లూరు , మందడం , వెలగపూడి గ్రామాల్లో దీక్ష శిబిరాలను సందర్శించి రైతులకు సంఘీభావాన్ని ప్రకటించనున్నారు .

 

సినీ పరిశ్రమకు చెందిన నారా రోహిత్ , సినీ నిర్మాత అశ్వనీదత్ , పాప్ సింగర్ స్మితలు ఇప్పటికే రాజధాని రైతులకు తమ సంఘీభావాన్ని తెలియజేసిన విషయం తెల్సిందే . ఇక మెగాస్టార్ చిరంజీవి మాత్రం రాష్ట్ర ప్రభుత్వ  మూడు రాజధానుల ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు . మూడు రాజధానుల వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని ఆయన వెల్లడించారు  . చిరు మినహా సినీ నటులు ఎవరు కూడా రాజధాని అంశం పై స్పందించేందుకు సాహసించలేదు .   సినీ పరిశ్రమ కు చెందిన నటీనటులు , మూడు రాజధానుల అంశం పై స్పందించాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం డిమాండ్ చేసింది . లేని పక్షం లో థియేటర్లలో మూసివేస్తామని హెచ్చరించారు . అయినా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఎవరు కూడా రాజధాని అంశం పై స్పందించలేదు .

 

ఇప్పుడు బాలయ్య , రాజధాని గ్రామాలను సందర్శించాలని నిర్ణయించుకున్నారు . అయితే బాలయ్య కేవలం సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తే కాకుండా , శాసనసభ్యుడు కూడా కావడంతో ఆయన రాక కోసం రాజధాని గ్రామాల రైతులు , ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు . బాలయ్య స్పందించినట్లుగానే  మిగిలిన సినీ ప్రముఖులు కూడా స్పందించి తమ ఆందోళనలకు మద్దతు తెలుపాలని కోరుకుంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: