ఆంధ్రప్రదేశ్:
నేడు విజయవాడలో తెలుగు రాష్ట్రాల సీఎస్లు భేటీ..
:విభజన సమస్యలు, ఉద్యోగుల సమస్యలపై చర్చ..
:విజయవాడలో తొలిసారి సీఎస్ల సమావేశం..
తిరుమల: నేడు శ్రీవారి ఆలయంలో పార్వేట ఉత్సవం..
నెల్లూరు: నేడు ముత్తుకూరు మండలంలో ఎంపీ విజయసాయిరెడ్డి పర్యటన..
: తాళ్లపూడిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న విజయసాయిరెడ్డి..
తిరుమలలో భక్తుల రద్ది సాధారణంగా ఉంది.
శ్రీవారి సర్వదర్శనానికి 30 కంపార్టుమెంట్లో భక్తులు వేచి వున్నారు .
సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా శ్రీవారి టైం స్లాట్ సర్వ, నడక, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.
కాగా నిన్న శ్రీవారిని 81,394 మంది భక్తులు దర్శించుకున్నారు.
అనంతపురం జిల్లా పెనుకొండ మడకశిర రోడ్ లో ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఎటిఎం చోరీకి యత్నం.
గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎం తొలగింపు మంటలు చెలరేగడంతో పరారైన దుండగలు
: నేడు ఉదయం 11 గంటలకు బీజేపీ, జనసేన నేతల సమావేశం..
:బీజేపీ తరపున హాజరుకానున్న కన్నా, జీవీఎల్, సునీల్ దేవధర్..
జనసేన తరుపున హాజరుకానున్న పవన్ కల్యాణ్, నాదెండ్ల.
:మధ్యాహ్నం 3గంటలకు బీజేపీ, జనసేన ఉమ్మడి మీడియా సమావేశం..
నేడు రాజధాని గ్రామాల్లో సీపీఐ నేతలు పర్యటిస్తున్నారు.
ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు నారాయణ, రామకృష్ణ, నాగేశ్వరరావు తదితరులు గ్రామాల్లో పర్యటించనున్నారు.
నేడు మందడం, తుళ్లూరులో రైతుల మహాధర్నా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా నేడు రాజధాని గ్రామాల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించనున్నారు.
ఆందోళన కార్యక్రమాల్లో బాలకృష్ణ పాల్గొననున్నారు.