నేటి నుంచి దేశ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.

 

నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేలో ముఖ్యమైన అంశాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు చూద్దాం. మార్కెట్లు అందుబాటులోకి తీసుకురావడం, వ్యాపార అనుకూల విధానాలను ప్రోత్సహించడం, ఆర్థిక వ్యవస్థల్లో విశ్వాసాన్ని పెంపొందించడం అనే ఇతివృత్తంతో 2019-20 సర్వేను ముందుకు తీసుకొచ్చారు.  5 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి నైతిక విలువలతో కూడిన సంపద చాలా కీలకం. ఏప్రిల్ 1తో మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6 నుంచి 6.5శాతం మధ్య ఉండవచ్చని అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రపంచంలోని పరిస్థితులు భారత్ కి అనుకూలంగా ఉంటాయి.

 

అలాగే ఈ సారి ఆర్థిక కవర్ పేజీలను ఊదారంగులో తయారు చేశారు. ద్రవ్యలోటు విషయంలో కొంత సడలింపు ఉండాలని సర్వే చెప్తుంది. ప్రస్తుత ఆగ్జిక సంవత్సరంలో పన్ను ఆదాయాలు అంచనాల కంటే తగ్గే అవకాశం ఉందని వారు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక వృద్ధిరేటు 5శాతంగా ఉంది. 2011-12 నుంచి 2017-18 మధ్యలో 2,62 కోట్ల ఉద్యోగాల ఇవ్వడం జరిగిందని తెలిపారు. అలాగే 'రాబినామిక్స్' పేరుతో అర్థశాస్త్రాన్ని సామాన్యుడికి అన్వయించే ప్రయత్నం చేశారు. ఒక ప్లేటు భోజనం కొనుగోలు చేసే శక్తి 29శాతం మెరుగుపడిందని ఈ సర్వే తెలిపింది. 2022 నాటికి వ్యవసాయదారుల ఆదాయం రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అయన తెలిపారు. 

 

ప్రభుత్వం చిన్న, సూక్ష్మ, మధ్యతరహా వ్యాపార సంస్థలకు రుణ సదుపాయం, సాంకేతికతను అందించడం, అలాగే ఈవోడీబీ, మార్కెట్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కట్టుబడి ఉంది. హైవేలు, రోడ్లపై పెట్టుబడులు 2014-15 మంది 2018-19 వరకు మూడు రెట్లు పెరిగాయని తెలిపారు. భారత వాణిజ్య పరిమాణంలో 95శాతం మొత్తం జీడిపి విలువలో 58 శాతం సరుకులు సముద్ర మార్గంలోనే రవాణా చేశారన్నారు. భారతీయ రైల్వే ప్రపంచంలోనే అత్యధిక మందని రవాణా చేసిన సంస్థగా రికార్డు సృష్టించింది. 120 కోట్ల టన్నులు సరకును, 140 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. భారత్ దేశంలో పెట్టుబడుల ఉపసంహరణ వేగవంతంగా జరగాలని సర్వే వెల్లడించింది. లాభదాయకం, సామర్థ్యం, పోటీతత్వం, నైపుణ్యం పెంచడానికి ఇది అవసరం అని పేర్కొంది. అలాగే ఉచితాలు ఆర్థిక వ్యవస్థకు సదాయకం అని సర్వే స్పష్టం చేసింది.

 

అడ్డదారులు తక్కువ ఖర్చుపెడతారు, తక్కువ పొదుపు చేస్తారు. తక్కువ పెట్టుబడి పెడతారని చెప్పింది. మాఫీలు రుణ వ్యవస్థను దెబ్బతీస్తాయని వెల్లడించింది ఆమె ఈ విధంగా  తెలిపారు. 2020-21 వార్షిక బడ్జట్ ను నిర్మలా సీతారామన్ శనివారం ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మాంద్యం నెలకొన్న సమయంలో ఈ బడ్జెట్ లో సంస్కరణలకు ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: