ఏపీ రాజకీయాల్లో కొన్ని రోజులుగా రాజధాని మార్పు, మండలి రద్దు అంశాలు ప్రముఖంగా ప్రస్తావనకు వస్తున్నాయి. పత్రికలు కూడా ఈ రెండు విషయాలపై బాగా ఫోకస్ చేశాయి. అయితే చంద్రబాబుకు అనుకూలంగా ఉంటే ఎల్లో మీడియా కొన్ని విషయాలనే కావాలని ప్రొజెక్టు చేస్తూ కొన్ని విషయాలను కావాలనే వదిలేస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది ప్రత్యేకించి శాసన మండరి రద్దు విషయానికి వస్తే.. ఈ అంశంపై ప్రత్యేకంగా కథనాలు వెలువరించాయి.

 

తమ అధినేత చంద్రబాబు స్టాండ్ కు మద్దతుగా ఈ కథనాలు వండాయి. అయితే.. వీటి తీరుపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలి రద్దు నేపథ్యంలో చంద్రబాబు అనుకూల మీడియా ప్రదర్శిస్తున్న ద్వంద్వ విధానాలపై ఆయన నిప్పులు చెరిగారు. 'ఎన్టీఆర్ మండలిని రద్దు చేసిన విషయాన్ని ఎల్లో మీడియా, బాబు గ్యాంగ్ ప్రస్తావించడం లేదు.

 

వైఎస్సార్ పునరుద్ధరించడాన్ని పదేపదే చెబుతున్నారు. చంద్రబాబు 1985, 2005లో రెండు సందర్భాల్లో మండలి ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఉపన్యాసం దంచాడు. మీ రెండు నాల్కల ధోరణి వీడియోల సాక్షిగా బయటపడిందిప్పుడు' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు..అలాగే.. మరో ట్వీట్‌లో.. ఏపీ రాజధానిగా విశాఖపట్నం అంశంలో చంద్రబాబు తీరును విమర్శించారు.

 

'జీవనోపాధి లేక ఉత్తరాంధ్ర ప్రజలు వలసలు వెళుతుంటే, వాళ్లపై నిప్పులు పోసుకుంటున్నారెందుకు చంద్రబాబు..? ఈనాడు, చంద్రజ్యోతిలతో జీఎన్ రావు కమిటీని వక్రీకరించే రాతలు రాయించారని ధ్వజమెత్తారు. ఒక్క విశాఖకు మాత్రమే కాదు ముంబయి, చెన్నై నగరాలకు కూడా తుపాను తాకిడి ఉందని విజయసాయి రెడ్డి తెలిపారు. విశాఖ ఏదో అగ్నిపర్వతం అంచున ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారని' ఆయన మండిపడ్డారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రకటనకు ముందే ఇన్‌సైడర్ ట్రేడింగులో చంద్రబాబు బినామీలు చుట్టుపక్కల భూములను చుట్టేశారు. దానిపైనా విచారణ జరిగితే నీతిచంద్రికల బండారం బయట పడుతుందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: