వైసీపీ మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ అమ్మఒడి పథకం కోసం 6500 కోట్లు విడుదల చేసి 82 లక్షల మంది పిల్లలకు చదువుకోవటానికి ఆర్థిక సాయం చేశామని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన దిగిపోయే సమయాని 39 లక్షల పెన్షన్లు ఉండగా ఇప్పుడు 54 లక్షల పెన్షన్లు ఇవ్వడం జరుగుతోందని చెప్పారు. చంద్రబాబు ట్విట్టర్లో జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చటం లేదని ఆయనపై 420 కేసులు ఉన్నాయని ఈ రాష్ట్రప్రజలను కూడా 420 మోసం చేసినట్టు చేస్తాడని  అంటారని కొడాలి నాని చెప్పారు. 
 
చంద్రబాబు బతుకే 420 అని చంద్రబాబు పుట్టినతేదీ 20వ తారీఖు, చంద్రబాబు పెట్టిన నెల 4 నిన్ను మించిన 420 ఈ రాష్ట్రంలోనే లేడని నాని అన్నారు. ఎల్లో మీడియా, చంద్రబాబు మాట్లాడుకొని కూడబలుక్కొని అన్నీ చేస్తారని కొడాలి నాని అన్నారు. చైనాలో కరోనా వైరస్ ఉందని ఏపీలో ఎల్లో వైరస్ ఉందని కొడాలి నాని అన్నారు. జగన్ గత ఎనిమిది నెలల నుండి ఒక్క మంచి కార్యక్రమం చేసినట్టు కూడా మీ కళ్లకు కనిపించటం లేదా అని ప్రశ్నించారు. 
 
చంద్రబాబు గతంలో జన్మభూమి కమిటీలు పెట్టాడని వైసీపీ పార్టీ వాళ్లు అయితే పెన్షన్లు రావని టీడీపీ పార్టీ వాళ్లు అయితే మూడు అంతస్తులు ఉన్నా పెన్షన్లు వస్తాయని చెప్పారు. 20 ఎకరాల పొలం ఉన్నా వాడికి పెన్షన్ రాసి ఇస్తారని ఎవడైనా 500,1000 మీ చేతికి ఇస్తామంటే కూడా పెన్షన్ రాసి ఇస్తారని అన్నారు. ఇటువంటి దుర్మార్గాలు చేశారు కాబట్టి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సర్వే చేసి పెన్షన్ అందిస్తున్నామని అన్నారు. 
 
ఇప్పటికైనా ఎవరికైనా పెన్షన్ పెట్టుకోవాలంటే గ్రామ సచివాలయంలో అర్జీ పెట్టుకుంటే అర్హులకు పెన్షన్ అందుతుందని కొడాలి నాని చెప్పారు. నిన్న కేంద్ర బడ్జెట్ విడుదల చేశారని టీడీపీ నేతలు బీజేపీతో చట్టాపట్టాలు వేసుకొని తిరిగి అన్నీ మాట్లాడతామని చెబుతారని కానీ వైసీపీ విమర్శలు చేస్తున్నానని అన్నారు. జగన్ బ్రహ్మాండగా పరిపాలిస్తున్నాడని పవన్ ఒప్పుకున్నాడని అందువలనే పవన్ సినిమాల్లో నటిస్తున్నాడని కొడాలి నాని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: