గతంలో తెలంగాణాలో జరిగిన "దిశా" ఘటన యావత్ భారత దేశంలో సంచలనం సృష్టించిన సంగతి విదితమే.. ఈ ఘటన జరిగిన తర్వాత కొన్ని రాష్ట్రాలు.. ఆడ పిల్లలపై ప్రత్యేక శ్రద్ద చూపేందుకు కొన్ని చట్టాలు తీసుకువచ్చారు. అందులో భాగంగానే.. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా దిశ బిల్లు- 2019ని తీసుకొచ్చింది. ఈ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కి పంపింది. కానీ ఇప్పుడు దిశ బిల్లు - 2019 కేంద్ర ప్రభుత్వం వెనక్కు పంపింది.
అయితే.. దిశ బిల్లు కేంద్రం నుంచి ఏపీ అసెంబ్లీకి రాగా.. అక్కడి నుంచి ప్రభుత్వానికి చేరింది. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని.. వాటిని వెంటనే సరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ దిశ బిల్లులో పొందుపరచిన 7వ షెడ్యూల్ లో ఎంట్రీలు సరిగా.. లేవని వాటిని సరిచేసి పంపాలని కేంద్రం సూచనలు చేసినట్లు తెలుస్తోంది. కేంద్రం చెప్పిన సవరణల్ని సరిచేసే పనిలో ఆంధ్రప్రదేశ్ అధికారులు ఉన్నారు.
కాగా., అయితే.. కేంద్రం సూచనలకు అనుగుణంగా ప్రభుత్వ అధికారులు సాంకేతిక అంశాలను సరిచేసి.. మళ్లీ త్వరలోనే బిల్లును కేంద్రానికి పంపిస్తారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత.. అక్కడి నుంచి రాష్ట్రపతి దగ్గరకు వెళ్లనుంది.. ఆయన కూడా ఆమోదించాక తర్వాత చట్ట రూపంలో దిశ యాక్ట్ అమల్లోకి వస్తుంది.
ఇదిలా ఉంటే దిశ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు జగన్ ప్రభుత్వం తన కసరత్తును ముమ్మరం చేసింది. దిశ పోలీస్ స్టేషన్ లు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో దిశ స్పెషల్ యాప్ ను, స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ నూ(ఎస్ఓపీ) ప్రారంభించనున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ 7న దిశ పోలీస్ స్టేషన్, వన్ స్టాప్ సెంటర్ ను ముఖ్యమంత్రి జగన్ చేతులు మీదుగా ప్రారంభంకానున్నాయి.