మహిళ స్నానం చేస్తుండగా ఓ ప్రబుద్దుడు వీడియో తీసి దాంతో .. దఫదఫాలు డబ్బు వసూలు చేసిన ఉదంతం హైదరాబాద్ లో జరిగింది. చివరకు ఈ దారుణం ఓ మహిళ ప్రాణాలు కూడా తీసింది. అసలేం జరిగిందంటే.. గత ఏడాది మే నెలలో పాతబస్తీలోని ఉప్పగూడ హనుమాన్‌నగర్‌కు చెందిన ఓ మహిళ స్నానం చేస్తోంది.

 

అదే ప్రాంతానికి చెందిన ఓ కేటుగాడు ఆమెను రహస్యంగా వీడియో తీశాడు. ఆ తర్వాత ఆమెకు ఫోన్ చేసి డబ్బు ఇవ్వాలని బెదిరించాడు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తాను తీసిన వీడియోలను ఇంటర్ నెట్లో పెడతానని బెదిరించాడు. భయపడిన ఆ మహిళ నిందితుడికి కొంత డబ్బు ఇస్తే గొడవ వదిలిపోతుందని భావించింది.

 

ముందు కొంత నగదు ఇచ్చింది. అయినా అతడి ధన దాహం తీరలేదు. మరోసారి డబ్బు కోసం వేధించాడు. పాపం.. తన పరువు పోతుందని భయపడిన ఆ మహిళ రెండో సారి కూడా డబ్బు వేలల్లో ముట్ట చెప్పింది. రెండు దఫాలుగా 2 లక్షలు ఇచ్చింది. అవే కాకుండా 3 తులాల బంగారు నగలూ ఇచ్చింది. ఆ తర్వాత విషయం క్రమంగా భర్తకు తెలిసింది. భర్త డిసెంబరు 19న ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

 

ఇక ఆ తర్వాత నుంచి కుటుంబసభ్యుల సూటిపోటి మాటలు, భర్తతో మనస్పర్థలు ఆమెకు తీవ్రంగా ఎదురయ్యాయి. ఈ బాధలతోనే ఆమె డిసెంబరు 31న ఆత్మహత్యకు యత్నించింది. ఆరోగ్యం కుదుటపడ్డాక సుభాష్‌నగర్‌లోని పుట్టింట్లో ఉంటోంది. అయితే భర్త తనను ఇంటికి తీసుకెళ్లకపోవడం ఆమెను మరింతగా బాధించింది. ఈ వరుస ఘటనలతో విరక్తి చెంది శనివారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: