ప్రస్తుత కాలంలో తినే పదార్థాలు ఆన్ లైన్ లో ఆర్డర్ చేయటం ఎక్కువ అయిపోయింది. ఒక వైపు సైబర్ క్రైమ్ వాళ్ళు మీ డిటైల్స్ నీ భద్రంగా ఉంచండి అంటూ.. నెత్తి నేలకు కొట్టుకున్న మేము చేసేది మీమే చేస్తామని చేసుకుంటూ పోతున్నారు యూజర్లు. ఇప్పుడు ఇదెందుకు చెప్తున్న అనుకుంటున్నారా..?? చదవండి మీకే తెలుస్తుంది...
 

రెండు రోజుల క్రితం జూబిలీహిల్స్ సమీపంలోని రహ్మత్ నగర్‌ కు చెందిన ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్, జుమాటో యాప్‌ లో చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు. తాను బిర్యాని ఆర్డర్ చేస్తే సాంబార్ రైస్ వచ్చింది. జుమాటో కస్టమర్ కేర్ నంబర్ కోసం ఆన్లైన్ లో వెళ్లి వెతికాడు.


అతనికి ఒక నెంబర్ కనపడటంతో దానికి కాల్ చేసి ఆర్డర్ గురించి వివరించాడు. అయితే ఇక్కడ అతను ఒక తప్పు చేసాడు. అతను చేసిన నంబర్ ఫిషింగ్ పేజీలోది. ఈ విషయాన్ని అతను గ్రహించ లేకపోయాడు. ఈ విషయాన్ని అంతా విన్న సైబర్ నేరగాళ్ళు రిఫండ్ ఇస్తామని అతన్ని నమ్మించారు. అతను మాట్లాడేంత లోపే అతనికి పేటీఎం నంబర్ ఉందని  సైబర్ నేరగాళ్లు తెలుసుకుని తమ సూచనలు పాటించాలని ఆ ఇంజనీర్ కి చెప్పారు. పేటీఎం వివరాలు తీసుకున్న అనంతరం, ‘‘రీఫండ్ ప్రోసెస్’’ అని చెప్పారు.


‘‘ప్రొసీడ్ టు పే’’ అనే సందేశం వచ్చిన తర్వాత, తనకు డబ్బులు వస్తాయేమోనన్న ఆశతో వాళ్లు చెప్పినట్లు చేశాడు. అలా మూడు సార్లు చేయగా అది ఎర్రర్ అని వచ్చింది. తర్వాత ఈ విషయాన్ని గ్రహించిన అతను డబ్బులు పోగొట్టుకున్నాడని అర్థమయ్యింది. మొత్తం తన ఖాతాలో రూ.50 వేలు పోగొట్టుకున్న విషయం గుర్తించాడు. ఈ ఘటనపై ఐపీసీ 420తో పాటు ఐటీ చట్టం 66సీ, 66డీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: