మహిళలు చాలా సెన్సిటివ్ ఏదైనా గుడ్డిగా నమ్ముతూ వస్తారు.. అయితే ఈ మధ్య మహిళలపై ఎన్నో చట్టాలు వచ్చిన కూడా కామాంధుల ఆగడాలు మాత్రం రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నారు... ఈ నేపథ్యంలో అంద్రప్రదేశ్ లో ఓ సంఘటన జరిగింది. అర్ద రాత్రి మహిళ ఒంటరిగా ఉందని గమంచిన ఇద్దరు కామాంధులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు.. అయితే ఆమె ఎక్కడా కృంగి పోకుండా దైర్యంగా వుంది.. అంతేకాకండా వారికి తగిన గుణపాఠం కూడా చెప్పింది.. 

 


వివరాల్లోకి వెళితే..అర్ధరాత్రి బస్సులో కీచకపర్వానికి పాల్పడ్డ ఇద్దరికి పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. జీరో ఎఫ్‌ఐఆర్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పశ్చిమ గోదావరిజిల్లాలో ఈ ఘటన చోటుచేసుకోగా కృష్ణా జిల్లా పోలీసులు నిందితుల ఆటకట్టించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ ప్రైవేటు బస్సులో మహిళ పట్ల ఇద్దరు వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారు.

 

 

అలా మార్గ మద్యలో వుండగానే వారిపై ఆమె పోలీసులకు పిర్యాదు చేసింది..పశ్చిమ గోదావరి జిల్లా కలపర్రు వద్ద ఈ ఘటన చోటుచేసుకోగా.. కృష్ణా జిల్లా విజయవాడలోని హనుమాన్‌ జంక్షన్‌ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో అర్ధరాత్రి 11 గంటల సమయంలో జీరో ఎఫ్‌ఐఆర్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు..అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు..

 


పోలీసులు అందించిన వివరాల ప్రకారం..ఈ ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు.. మరో విషయమెంటంటే..పశ్చిమ గోదావరి జిల్లా నారాయణపురంకు చెందిన యజ్జల దర్బార్, అతని కుమారుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం నిందితులను మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా హనుమాన్‌ జంక్షన్‌ పోలీసులను నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు అభినందించారు. జీరో ఎఫ్‌ఐఆర్‌తో మహిళలకు అదనపు భద్రత లభిస్తుందని అన్నారు..పోలీసుల తీరుపై పలువురు మహిళలు,ప్రజలు ప్రశంసలు కురిపిస్తు న్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: