ఏపీ సీఎం జగన్ కర్నూలు జిల్లాలో పర్యటించిన వేళ వైసీపీ నేతల్లో ఆనందం తొణికిసలాడింది. అందులోనూ కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించిన తర్వాత జగన్ చేస్తున్న తొలిపర్యటన కావడంతో నేతలు పండగ చేసుకున్నారు. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ అయితే జగన్ ను ఆకాశానికెత్తేశారు. 60 దశాబ్దాలుగా స్వప్నాన్ని నిజం చేసిన మనసున్న మారాజు సీఎం వైయస్‌ జగన్‌ అని, కర్నూలును జ్యుడిషియల్‌ క్యాపిటల్‌గా ప్రకటించి రాయలసీమ ప్రజల ఆకాంక్షలు తీర్చిన తొలి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని అన్నారు.

 

గత ముఖ్యమంత్రి 2014 ఆగస్టు 15న కర్నూలు వచ్చి 60కిపైగా హామీ ఇచ్చి శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం మన హక్కు అయిన రాజధానిని కూడా కర్నూలు నుంచి గద్దలాగా తన్నుకొని వెళ్లిపోయాడని ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ విమర్శించారు. తొలిసారి కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం వైయస్‌ జగన్‌ రాయలసీమ ప్రజల ఆకాంక్షలు తీర్చిన తొలి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. రాయలసీమ వాసుల 60 సంవత్సరాల స్వప్నం అయిన హైకోర్టు ఏర్పాటు చేసి కర్నూలును జ్యుడిషియల్‌ క్యాపిటల్‌ చేసిన మనసున్న మహరాజు మన జగనన్న అంటూ ప్రశంసలతో ముంచెత్తారు.

 

 

ముఖ్యమంత్రి అయినా జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు హామీలు ఇచ్చి మరిచిపోతారని.. కానీ, సీఎం వైయస్‌ జగన్‌ మాట ఇచ్చి.. జ్యుడిషియల్‌ క్యాపిటల్‌గా ప్రకటించిన తరువాత కర్నూలుకు వచ్చారని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గుర్తు చేసుకున్నారు.

 

రాజకీయాల్లో సంస్కరణలు రావాలని చెప్పి ఆ మాటలను నిజం చేస్తూ.. బడుగు, బలహీనవర్గాలకు, మైనార్టీలకు పెద్దపీట వేస్తూ పదవుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించి జగన్ దేశానికి ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. గడిచిన ఎనిమిది నెలల కాలంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. నవరత్నాల అమలు, వలంటీర్ల వ్యవస్థ, దిశ చట్టం, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, వాహనమిత్ర, జగనన్న గోరుముద్ద వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైయస్‌ జగన్‌దని ప్రశంసించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: