అయితే తోట త్రిమూర్తులు జగ్గయ్యపేట వైసిపి ఎమ్మెల్యే ఉదయభాను జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. అప్పటి నుంచి తోట త్రిమూర్తులు ఒక వర్గంగా... ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మరో వర్గంగా... మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉంటూ వస్తున్నారు. అయితే బుధవారం టీటీడీ చైర్మన్ వై వి. సుబ్బారెడ్డి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ వైసిపి అధ్యక్షుడిగా ఉన్న తోట త్రిమూర్తులు అన్నీ తానే వ్యవహరించారు. సమావేశ ప్రాంగణానికి సుబ్బారెడ్డి వస్తున్న టైంలోనే ఆయన కాన్వాయ్ను చెల్లుబోయిన వేణు వర్గం అడ్డుకుంది తోట త్రిమూర్తులకు వ్యతిరేకంగా ధర్నాలు చేశారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదర గొట్టారు. అయితే అక్కడ కొందరు కార్యకర్తలు తోట త్రిమూర్తులు ఫ్లెక్సీ చించేశారు. కరవ మంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్న చందంగా ఈ మూడు గ్రూపుల నేతలు ఉన్నారు.
వీరిలో ఎవరు ఎప్పుడు ఎవరితో కలుస్తారో ? కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. బోస్ మండపేటతో పాటు ఇక్కడ కూడా తన గ్రూపును అలాగే మెయింటైన్ చేస్తున్నారు. ఇక తోట పార్టీ మారి వచ్చినా తన పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనా ఈ కీలక నియోజకవర్గంలో వైసీపీలోనూ మూడు గ్రూపులు ఉండడం వైసీపీ అధిష్టానానికి పెద్ద సవాల్గా మారింది.