చింత చచ్చిన పులుపు చావలేదంటే ఇదే...కాటికి కాళ్ళు చాపుకున్న ఓ ముసలాడు తనకు పిల్లా డుని కనిపెట్టలని మొందికేసుకొని కుర్చున్నడట అందుకోసం ఆ యువతిని లైంగికంగా వేధించారని కూడా సమాచారం..అతని ఆగడాలు రోజు రోజుకు ఎక్కువ అవడంతో ఆ యువతీ పోలీసులను ఆశ్రయించింది.. హైదరాబాద్ నగరంలో వింత కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. 64 ఏళ్ల వ్యక్తి తనకు కొడుకు కావాలని ఆశపడ్డాడు.

 

 

తన భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేనందున సరోగసీ విధానం ద్వారా బిడ్డను పొందాలని ప్రయత్నంలో ఉన్నాడు. పరిచయమున్న ఓ మహిళకు ఈ విషయం చెప్పగా ఆమె ఓ యువతి తీసుకొచ్చింది. ఆమెతో అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత సరోగసీలో ఎందుకు.. నేరుగా కాపురం చేసి బిడ్డను కనివ్వు అంటూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బెంబేలెత్తిపోయిన ఆ యువతి ఈ విషయాన్ని భర్తకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 


ఆమె ఈ విషయాన్నీ వెంటనే తన భర్తకు చెప్పింది. అయితే ఇద్దరు వెళ్లి  విషయాన్నీ వెళ్లి పోలీసులకు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. సరోగసీ విధానంలో తనకు బిడ్డను కనిస్తే రూ.5లక్షలిస్తానని, ఆ తర్వాత కూడా నెలవారీ ఖర్చుల కోసం రూ.10వేలు ఇస్తానని చెప్పడంతో ఆమె సరేనంది.దీంతో స్వరూప్‌రాజ్ ఆమెకు రూ.50వేల అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఇందులో భాగంగా ఇద్దరు రక్త పరీక్షలు చేయించుకున్నారు. ఆ తర్వాత మగబిడ్డే పుట్టాలని దేవుడు ప్రార్థించేందుకు ఆమెను బిర్లా మందిర్‌కు తీసుకెళ్లాడు. 

 

 


అక్కడ యువతితో మాట్లాడుతూ.. ‘సరోగసీ విధానం ద్వారా పిల్లలను కనడం ఎందుకు, నేరుగా కాపురమే చేసి కనివ్వు’ అంటూ ఆమె వద్ద ప్రపోజల్ పెట్టాడు. అతడి మాటలకు బెంబేలెత్తిపోయిన యువతి వెంటనే ఇంటికి వెళ్లి తన భర్తకు విషయం చెప్పింది. దంపతులిద్దరూ కలిసి పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి స్వరూప్‌రాజ్‌పై ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు స్వరూప్‌రాజ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది .. 

మరింత సమాచారం తెలుసుకోండి: