ఈ మద్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో అక్రమ సంబంధం కేసులు బాగా పెరిగిపోతున్నాయి. వివాహ బంధాన్ని బ్రస్టు పట్టిస్తూ కొంత మంది చేస్తున్న దారుణాలు చూస్గుంటే భయం వేస్తుంది. పెద్దలు కలిసి అక్షింతలు వేసి ఏడడుగులు నడిచి వివాహ బంధంతో ఒక్కటైన వారు క్షణిక సుఖం కోసం పరాయి వారి మోజులో పడి సొంత వారిని హత్యలు చేస్తున్నారు. తాజాగా ప్రియుడిపై మోజుతో కట్టుకున్న భర్తను దారుణంగా చంపేసిందో భార్య. అక్రమ సంబంధానికి అడ్డుతొలగించు కునేందుకు కట్టుకున్న భర్తను చంపేసి నడిరోడ్డుపై పడేసింది.
సంగారెడ్డి జిల్లాలోని బీరప్ప బస్తీకి చెందిన వెంకటయ్య, వెంకటమ్మ దంపతులు. వెంకటమ్మ కొద్దికాలంగా మరో వ్యక్తితో అక్రమ సంబంధం నెరుపుతోంది. భర్త లేని సమయంలో ప్రియుడితో రాసలీలలు సాగిస్తూ వస్తుంది. అయితే ఈ విషయం భర్తకు తెలిస్తే తమ రాసలీలలకు అడ్డు వస్తాడని తన భర్తను ఎలాగైనా చంపేస్తే తన రంకు భాగోతానికి ఎవరూ అడ్డు ఉండరని భావించింది. ఆయనకు ఉన్న బలహీనతనే క్యాష్ చేసుకొని అన్యాయంగా చంపేసింది. మద్యం అలవాటు ఉన్న భర్తకు పికలదాకా మద్యం తాగించి చంపేయాలని పథకం వేసింది.
తన స్నేహితురాలితో కలిసి మర్డర్ ప్లాన్ను అమలు చేసింది. ఓ రోజుకు భర్తకు మందు ఆఫర్ చేసింది. భార్య స్వయంగా మద్యం ఇవ్వడంతో ఫుల్లుగా తాగేశాడు. మత్తులోకి జారుకున్న భర్తను కసిగా పొడిచి చంపేసింది. ఆ తర్వాత సైలెంట్ గా శవాన్ని తీసుకెళ్లి అమీన్పూర్ లాలాబాయి కాలనీ వద్ద పడేసింది. ఏమీ ఎరుగని మనిషిలా ఇంటికి వచ్చేసింది. తర్వాత తన పని తాను చేసుకుంటుంది. అయితే లాలాబాయి కాలనీ మృతదేహం ఉందని తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అంతే కాదు తమదైన శైలిలో వెంకటమ్మ ఎంక్వేయిరీ చేశారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే భర్తను హత్య చేసిందని వెల్లడించారు. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు.